✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

బిహార్‌ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్‌ 2025

POLL OF POLLS  (122/243)
131-157
NDA
80-93
MGB
3-6
OTH
(Source:  Poll of Polls)
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Dangerous Railway Routes : ఇండియాలోని ప్రమాదకర రైల్వే మార్గాలు ఇవే.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

Dangerous Railway Routes : ఇండియాలోని ప్రమాదకర రైల్వే మార్గాలు ఇవే.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

Geddam Vijaya Madhuri Updated at: 12 Aug 2025 11:49 AM (IST)
1

కోరాపుట్ విశాఖపట్నం వెళ్లే మార్గం.. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ కొండలు, అడవుల గుండా వెళుతుంది. ఇక్కడ నక్సల్ కార్యకలాపాలు ఎక్కువగా ఉంటాయి. గతంలో ఇక్కడ ట్రాక్​పై భారీ రాళ్లు పడటం, గూడ్స్ రైళ్లు పట్టాలు తప్పడం వంటి సంఘటనలు జరిగాయి.

Download ABP Live App and Watch All Latest Videos

View In App
Continues below advertisement
2

హిమాచల్​ప్రదేశ్​లో 96 కిలోమీటర్ల పొడవైన కాలకా సిమ్లా మార్గం యునెస్కో గుర్తింపు పొంది ప్రపంచ వారసత్వ ప్రదేశంగా నిలిచింది. అయితే ఇక్కడ వర్షాకాలంలో కొండచరియలు విరిగిపడటం, ట్రాక్​పై జారడం, పాత వంతెనలపై నీరు చేరడం వల్ల ప్రమాదాల ముప్పు ఎక్కువగా ఉంటుంది.

3

కుర్సియాంగ్, డార్జిలింగ్ మార్గం.. చారిత్రక బొమ్మ రైలుకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. కానీ ట్రాక్‌తో పాటు రహదారి ఉండటం వల్ల వాహనాలు ఢీకొనడం, దట్టమైన పొగమంచు ప్రమాదాలకు ప్రధాన కారణాలు అవుతున్నాయి.

Continues below advertisement
4

మెట్టుపాళయం, ఊటీ నీలగిరి మౌంటెన్ రైల్వే మార్గం.. పచ్చని అడవులు, పర్వతాల గుండా వెళ్తుంది. ఇక్కడ వేగవంతమైన వాలు, మలుపులు, శిథిలమైన ట్రాక్ కారణంగా బోగీలు పట్టాలు తప్పే సంఘటనలు జరుగుతాయి.

5

చెన్నై నుంచి రామేశ్వరం వెళ్లే రైలు మార్గం.. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ట్రాక్‌లలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ మార్గంలో ఉన్న పంబన్ వంతెన హిందూ మహాసముద్రంపై నిర్మించారు. భారీ వర్షాల కారణంగా ట్రాక్‌లపై నీరు చేరడం, మట్టి జారడం, రాళ్లు పడటం వంటివి రైలుకు పెద్ద ప్రమాదంగా మారుతాయి.

6

ఆ మార్గాల్లో ప్రమాదాలకు పాత ట్రాక్‌లు, మౌలిక సదుపాయాలు, సాంకేతిక లోపాలు, ప్రతికూల వాతావరణం, కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం, మానవ నిర్లక్ష్యం వంటివి కారణాలుగా ఉన్నాయి. ఇవి ప్రమాదాలకు దారి తీస్తున్నాయి.

7

ప్రయాణికులు ఈ మార్గాల్లో ప్రయాణిస్తున్నప్పుడు వాతావరణం, భద్రతా సూచనలను తెలుసుకుని వెళ్తే మంచిది. అదే సమయంలో అధికారులు రైల్వే ట్రాక్, రైలును తనిఖీ చేసి మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. తద్వారా ప్రయాణం సురక్షితంగా జరుగుతుంది.

NEXT PREV
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.