YS Jagan : ట్రాఫిక్లో ఇరుకున్న వైఎస్ జగన్ కాలినడకన వెళ్లి తొక్కిసలాట బాధితులకు పరామర్శ

తిరుపతిలో జరిగిన తొక్కిసలాట బాధితులను వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
పద్మావతి మెడికల్ కాలేజీకి చేరుకునే సమయంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

ట్రాఫిక్లో జగన్ కాన్వాయ్ ఇరుక్కుంది. ముందుకు వెళ్లే దారి లేకపోవడంతో తిరుచానూరు క్రాస్ వద్ద తన బుల్లెట్ ప్రూఫ్ వాహనం వదిలి నడుచుకుంటూనే కాలినడకన బయల్దేరారు జగన్
ట్రాఫిక్ ఎందుకు క్లియర్ చేయలేదని పోలీసు అధికారులతో జగన్, వైసీపీ నేతల వాగ్వాదానికి దిగారు.
తనను బాధితుల వద్దకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారా అని పోలీసులతో వాదించిన జగన్
వైకుంఠ ఏకాదశి సందర్భంగా భారీగా భక్తులు రావడంతో ట్రాఫిక్ జామ్ అయిందని సర్ధి చెప్పిన పోలీసులు
పద్మావతి మెడికల్ కాలేజీకి చెందిన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తిరుపతి తొక్కిసలాటబాధితుల్ని జగన్ కాలినడకన వచ్చి పరామర్శించారు.
క్షతగాత్రులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు జగన్
తొక్కిసలాట ఘటన జరిగిన విధానాన్ని వారి ద్వారా అడిగి తెలుసుకున్నారు వైఎస్ జగన్.
అక్కడ ఏం జరిగిందో జగన్కు బాధితులు వివరించే ప్రయత్నం చేశారు.
అందుతున్న వైద్య సేవలపై కూడా వైద్యులను జగన్ అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం నుంచి సాయం అందే వరకు ప్రభుత్వాన్ని వైసీపీ వెంటాడుతుందని బాధితులకు జగన్ భరోసా ఇచ్చారు.
మృతుల కుటుంబాలకు 50 లక్షల పరిహారం ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు ఒక్కొక్కరికి ఐదు లక్ష రూపాయల పరిహారం ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారు.
జగన్ వచ్చే లోపు బాధితుల్ని తరలించారని అందుకే తన కాన్వాయ్ను అడ్డుకున్నారని జగన్ ఆరోపించారు.