Mukhesh Ambani: తిరుమల ఆలయంపై ముకేశ్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు
తిరుమల శ్రీవారిని ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ దర్శించుకున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనేటి ఉదయం అభిషేక సేవలో తనకు కాబోయే కోడలు రాధికతో కలిసి అభిషేక సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.
శ్రీవారి ఆలయం నుంచి నేరుగా టిటిడి గోశాలకు వెళ్ళిన అంబానీ అక్కడ ఉన్న మహాలక్ష్మి ఏనుగుకు పళ్లు అందించి, గజేంద్రుడి వద్ద ఆశీర్వాదం తీసుకున్నారు.
కొంత సేపు పాటు గోశాలలో గడిపిన ముకేశ్ అంబానీ తర్వాత శ్రీకృష్ణ గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు.
శ్రీవారి ఆశీస్సులు పొందడం చాలా సంతోషంగా ఉందన్నారు. శ్రీవారి ఆలయంలో రోజు రోజుకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తారని చెప్పారు.
దేశ పౌరులకు శ్రీవారి ఆలయం ఓ గర్వకారణం అని రిలయన్స్ అధినేత వ్యాఖ్యానించారు.
కార్యకమం ముగిసిన తరువాత రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు.
ప్రత్యేక చార్టెడ్ విమానంలో ముకేశ్ అంబానీ ముంబైకి తిరుగు ప్రయాణమయ్యారు.