కేసులు ఎత్తేస్తూ నిర్ణయం


ప్రొఫెసర్‌ హరగోపాల్ సహా ఇతరులపై పెట్టిన UAPA కేసులు ఎత్తివేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌కు ఆదేశాలు ఇచ్చారు. పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశద్రోహం కేసు నమోదు తెలంగాణలో సంచలనంగా మారింది. ఉపా చట్టం (Unlawful Activities (Prevention) Act) 2022 కింద గత ఏడాది ఆగస్టులో 19న ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్‌లో కేసు ఫైల్ అయింది. ఇదే కాక ఆయుధాల చట్టం, సెక్షన్ 10 కింద కేసులు నమోదు అయ్యాయి. హరగోపాల్‌తో పాటు 152 మంది ఉద్యమకారులు, మేధావులు ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా ఉన్నారు. పూర్తి వివరాలు 


 


ఐటీ సోదాలపై కామెంట్


ఇంట్లో గంటన్నరలో సోదాలు ముగిసినా మూడు రోజుల పాటు కావాలనే సాగదీశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి విమర్శించారు.  అధికారులు ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేశారని ఆరోపించారు. తన నివాసానికి వచ్చిన గంటన్నరలోపే అధికారులకు అన్ని వివరాలు అందజేశామని, అయినా మూడు రోజుల పాటు హంగామా చేశారని విమర్శించారు. కాగా, ఎమ్మెల్యే పైళ్ల నివాసంలో మూడు రోజుల పాటు కొనసాగిన ఐటీ దాడులు శనివారం ఉదయం ముగిశాయి.  విచారణకు రమ్మంటూ పైళ్ల శేఖర్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. అయితే ఎప్పుడు రావాలో చెప్పలేని.. ఎ్మెల్యే చెబుతున్నారు.    పూర్తి వివరాలు 


 


28న అమ్మఒడి డబ్బులు 


ఏపీలో 'జగనన్న అమ్మఒడి' పథకం నిధులను జూన్ 28న విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2022-23వ సంవత్సరానికి సంబంధించి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయనుంది. కుటుంబ ఆదాయం పట్టణాల్లో నెలకు రూ.12,000; గ్రామాల్లో రూ.10,000 లోపు ఉండాలి. అమ్మఒడి కింద ఇచ్చే రూ.15,000 నుంచి పాఠశాల, మరుగుదొడ్ల నిర్వహణ నిధి కోసం రూ.2,000 మినహాయించి, మిగతా రూ.13వేలు మాత్రమే తల్లుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది. పూర్తి వివరాలు


 


వీసీ కక్కుర్తి 


తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ రవీందర్ గుప్తా ఏసీబీ ఉచ్చులో పడ్డారు. శనివారం రోజు హైదరాబాద్ లోని తన నివాసంలో 50 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. గత కొంతకాలంగా తెలంగాణ యూనివర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణ నేపథ్యంలో ఏసీబీ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగాలు యూనివర్సిటీలో సోదాలు నిర్వహించాయి. ఆరోపణలకు తగ్గట్లే అక్రమ నియామకాలు, అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఏసీబీ నిర్ధారించుకున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా పరీక్షా కేంద్రం ఏర్పాటు కేసం ఓ వ్యక్తి నుంచి వీసీ రవీందర్ గుప్తా డబ్బులు డిమాండ్ చేశారు. పూర్తి వివరాలు


 


జూమ్ మీటింగ్ 


తెలంగాణ రాజకీయాల్లో అతి త్వరలో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. ఖమ్మం జిల్లా కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఈయనతో పాటు జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కూడా హస్తం పార్టీలోకి రాబోతున్నట్లు సమాచారం. అయితే ఈనెల 22వ తేదీన వీళ్లంతా కాంగ్రెస కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా ఆయన కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీతో జూమ్ మీటింగ్ లో మాట్లాడినట్లు సమాచారం. రాహుల్ గాంధీతో జూమ్ మీటింగ్ లోనే పొంగులేటి చేరిక తేదీ ఫిక్స్ అయింది. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారట. విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ ఈనెల 21వ తేదీన ఢిల్లీకి చేరుకుంటారు. అదే తేదీన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇక జూపల్లి, పొంగులేటి చేరిక తర్వాత ఖమ్మం, పాలమూరుల్లో కాంగ్రెస్ పార్టీ భారీగా బహిరంగ సభ నిర్వహించే యోచనలో ఉంది. పూర్తి వివరాలు