AP Telangana News | పాకిస్థాన్ కంపెనీకి మూసీ నది సుందరీకరణ పనులు- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
దేశ రాజకీయాల్లోనే సంచలనం కలిగించే వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ చేశారు. హైదరాబాద్‌లో జరగబోయే మూసీ నది సుందరీకరణ పనుల విషయంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌ అవుతున్నాయి. ఫతేనగర్‌లోని సీవేజ్‌ ప్లాంట్‌ పని తీరు పరిశీలించేందుకు వెళ్లిన కేటీఆర్‌ ప్రభుత్వం, రేవంత్‌రెడ్డి, మూసీ సుందరీకరణ పనులపై హాట్ కామెంట్స్ చేశారు. మూసీ సుందరీకరణ పనులు పాకిస్థాన్ కంపెనీకి సీఎం రేవంత్ రెడ్డి కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు కేటీఆర్. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


నేనేంటో నా అభిమానులందరికీ తెలుసు-రేప్ కేసుపై హర్ష సాయి ఫస్ట్ రియాక్షన్ ఇదే
తనపై నమోదైన రేప్ కేసుపై యూట్యూబర్ హర్షసాయి(Harsha Sai) తొలిసారిగా సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. అవన్నీ తప్పుడు ఆరోపణలు అని కొట్టుపారేశాడు. డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారని, త్వరలోనే నిజం బయటకు వస్తుందని తన గురించి తన అభిమానులందరికీ తెలుసని అన్నాడు. ఇక లీగల్ ఇష్యూస్ ని తన తరపున ఉన్న న్యాయవాది చూసుకుంటారని క్లారిటీ ఇచ్చాడు హర్షసాయి. హర్షసాయి వివరణలో కొత్త విషయమేమీ లేదు. సహజంగా ఆరోపణలు వచ్చిన తర్వాత అందరూ చెప్పే మాటలే హర్షసాయి కూడా చెప్పాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


మూసీ నిర్వాసితులకు బిగ్‌ రిలీఫ్‌- గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్
తెలంగాణలో హైడ్రా వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న వేళ ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపట్టింది. త్వరలో మూసీ(Musi) ప్రక్షాళణ కూడా మొదలు కాబోతున్న నేపథ్యంలో నిర్వాసితుల్ని ముందుగానే గుర్తించి వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూసీ నిర్వాసితులకు 16వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. మూసీ రివర్ బెడ్, బఫర్ జోన్ లో నివాసం ఉంటున్న వారిని అక్కడినుంచి తరలించి ఆర్థిక సాయం అందిస్తారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి



నారా లోకేష్ ఇలాంటి వారా ? విశాఖలో ఏం జరిగిందో తెలుసా ?
రాజకీయ నాయకులు అంటే సామాన్యుల  బాధతలు పట్టించుకోరని..  తాము సవారీ చేయడానికే ఉన్నామని అనుకుంటూ ఉంటారు. అధికారంలో ఉన్నవారు అయితే ఇంకా ఎక్కువ. కానీ కొంత మంది డౌన్ టు ఎర్త్ ఉంటారు. అలాంటి రాజకీయ నేతల్లో నారా లోకేష్ ఒకరు. విశాఖలో జరిగిన ఈ ఘటనపై ఆయన స్పందనే దీనికి నిదర్శనం. నారా లోకేష్ సీఐఐ సదస్సులో పాల్గొనేందుకు విశాఖ వెళ్లారు. ఆయన కాన్వాయ్ రోడ్డుపై దూసుకెళ్తున్న సమయంలో మరో కారును తాకింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


అనంతపురంలో రథం కాల్చిన నిందితుడు అరెస్ట్ - 24 గంటల్లోనే కేసు ఛేదించిన పోలీసులు 
అనంతపురం జిల్లా కనేకల్ మండలం హనకనహళ్ గ్రామంలో రామాలయం రథానికి నిప్పు పెట్టిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రథానికి నిప్పు పెట్టినవారు ఎవరైనా సహించలేదని దర్యాప్తును ముమ్మరం చేసి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు 24 గంటల్లోనే రామాలయం రథానికి నిప్పు పెట్టిన నిందితులను అరెస్టు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి