Shraddha Murder Case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న అఫ్తాబ్ అమీన్ పూనావాలాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ హెడ్‌క్వార్టర్స్‌కు పోలీసులు తీసుకువెళ్లారు, ఈ కేసుకు సంబంధించి వాయిస్ శాంప్లింగ్ పరీక్ష కోసం ఇక్కడకు తీసుకువచ్చినట్లు వార్తా సంస్థ ANI తెలిపింది.






నిందితుడు అఫ్తాబ్.. శ్రద్ధాతో గొడవపడుతోన్న ఓ ఆడియో క్లిప్ దిల్లీ పోలీసులకు దొరికింది. అనంతరం దిల్లీ కోర్టు ఆదేశాల మేరకు వాయిస్ శాంప్లింగ్ పరీక్షలు నిర్వహించినట్లు ఎన్‌డీటీవీ వెల్లడించింది. పోలీసులు.. ఈ ఆడియో క్లిప్‌ను "పెద్ద సాక్ష్యం"గా పరిగణిస్తున్నారు. కోల్డ్ బ్లడెడ్ హత్య వెనుక ఉద్దేశాన్ని ఈ క్లిప్ తెలియజేస్తుందని సమాచారం. 


బెయిల్ వద్దు


తనకు బెయిల్ మంజూరు చేయాలని వేసిన పిటిషన్‌ను అఫ్తాబ్ ఉపసంహరించుకున్నాడు. అఫ్తాబ్‌యే బెయిల్ వద్దని చెప్పడంతో దిల్లీ సాకేత్ కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.


వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరైన అఫ్తాబ్ తాను డిసెంబరు 15న కోర్టులో వేసిన తన బెయిల్ అభ్యర్థనను ఉపసంహరించుకోవాలని అనుకుంటున్నానని తెలిపాడు. దీనిపై శ్రద్ధా తండ్రి తరపున వాదిస్తున్న న్యాయవాది సీమా కుష్సహా మాట్లాడారు.



ఇప్పటివరకు ఇంకా ఛార్జ్ షీట్ యే దాఖలు చెయ్యలేదు, అఫ్తాబ్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ కోసం వేసిన పిటిషన్‌ను అఫ్తాబ్ అంగీకరించలేదు. అతని తరపు న్యాయవాది మొదట మానవత్వం వైపు నిలబడి తర్వాత నేరస్థుడు గురించి పోరాడాలి. ఎలాగైతేనేం ఈ రోజు అతనే బెయిల్ పిటిషన్ ను ఉపసంహరించుకున్నాడు. "
-                              శ్రద్ధా తండ్రి తరఫు న్యాయవాది



ఈ హత్య కేసులో నవంబరు 12న అరెస్ట్ అయిన అఫ్తాబ్ ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్నాడు. కోర్టు డిసెంబరు 9న అఫ్తాబ్ కస్టడీ 14 రోజులు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.


పోలీస్ విచారణ 


ఈ కేసు దర్యాప్తులో పురోగతి గురించి స్పెషల్ పోలీస్ కమిషనర్ సాగర్ ప్రీత్ హూడా మాట్లాడారు. 



డీఎన్ఏ టెస్ట్ నివేదిక, పాలిగ్రఫ్ టెస్ట్ నివేదికలు పోలీసులకు అందాయి. డిసెంబరు 2న నిర్వహించిన పోస్ట్ నార్కో టెస్ట్ లో హత్య చేసినట్టు అఫ్తాబ్ ఒప్పుకున్న నివేదిక ఇంకా అందలేదు. అఫ్తాబ్ పాలిగ్రఫ్ టెస్ట్ నివేదిక ఈ బుధవారం పోలీసులకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ వారు సమర్పించారు. కేసు నమోదు అయినప్పటి నుంచి విచారిస్తున్న పోలీసులు ఇప్పటి వరకు 13 ఎముకలను సేకరించారు. హత్య జరగడానికి మూడు రోజుల ముందు వారు మారినా చట్రాపుర్ ఇంట్లో రక్త నమూనాలు సేకరించారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతునే ఉంది.                                           "
- సాగర్ ప్రీత్, స్పెషల్ పోలీస్ కమిషనర్



Also Read: US Weather-Related Deaths: అమెరికాలో మంచు తుపాను బీభత్సం- 31 మంది మృతి!