Republic Day 2024 LIVE Updates: కర్తవ్యపథ్‌లో కాసేపట్లో గణతంత్ర వేడుకలు - ఢిల్లీ మొత్తం హైఅలర్ట్‌!

Republic Day 2024 LIVE Updates: రిపబ్లిక్‌ డే వేడుకల్లో భాగంగా నిర్వహించనున్న కవాతు వీక్షించేందుకు సుమారు 77 వేల మంది రానున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు.

ABP Desam Last Updated: 26 Jan 2024 08:53 AM

Background

Republic Day Celebrations in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న రిపబ్లిక్‌ డే వేడుకలను పటిష్ట భద్రత నడుమ నిర్వహించనున్నారు. ఈ ఏడాది రిపబ్లిక్‌ డే వేడుకల్లో భాగంగా నిర్వహించనున్న కవాతు వీక్షించేందుకు సుమారు 77 వేల మంది రానున్నారని...More

75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 80 మంది సైనికులకు శౌర్య పురస్కారాలు

ఈసారి గణతంత్ర దినోత్సవం సందర్భంగా సాయుధ దళాలకు చెందిన 80 మంది సైనికులను శౌర్య పురస్కారాలతో సత్కరించనున్నారు. వీరిలో 12 మందికి మరణానంతరం ఈ గౌరవం దక్కనుంది. 80 శౌర్య పురస్కారాల్లో 6 కీర్తి చక్ర, 16 శౌర్య చక్ర, 53 సేన పతకాలు, 1 నేవీ మెడల్, 4 వాయుసేన పతకాలు ఉన్నాయి. గాలంట్రీ అవార్డులతోపాటు 311 డిఫెన్స్ డెకరేషన్స్ కూడా ఇచ్చారు. వీటిలో 31 పరమ విశిష్ట సేవా పతకాలు, 4 ఉత్తమ్ యుద్ధ సేవా పతకాలు, 2 అతి విశిష్ట సేవా పతకాలు, 59 అతి విశిష్ట సేవా పతకాలు, 10 యుద్ధ సేవా పతకాలు, 8 సేన మెడల్ బార్, 38 సేన పతకాలు, 10 నేవీ పతకాలు, 14 వాయుసేన పతకాలు, 5 విశిష్ట సేవా పతకాలు ఉన్నాయి.