Rajasthan News: భక్తుల రద్దీతో ఆలయంలో తొక్కిసలాట- ముగ్గురు మృతి

Advertisement
ABP Desam   |  Edited By: Murali Krishna Updated at: 08 Aug 2022 05:27 PM (IST)

Rajasthan News: రాజస్థాన్‌లోని ఖాతూ శ్యామ్‌ జీ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మృతి చెందారు.

(Image Source: PTI)

NEXT PREV

Rajasthan News: రాజస్థాన్‌లోని ఓ ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి.

Continues below advertisement






ఇదీ జరిగింది


సికార్ జిల్లాలోని ఖాతూ శ్యామ్ జీ ఆలయంలో సోమవారం ఉదయం జాతర సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగుతుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకే ఖాతూ శ్యామ్ జీ ఆలయాన్ని తెరిచారు. ఆలయ దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. దీంతో ఆలయ ప్రవేశ ద్వారం వద్ద భక్తుల మధ్య తొక్కిసలాట జరిగింది. 


ఈ తొక్కిసలాటలో ముగ్గురు మహిళా భక్తులు మరణించారు. తొక్కిసలాటలో గాయపడిన భక్తులను జైపుర్ ఆసుపత్రికి తరలించారు. 


ప్రధాని సంతాపం


తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. 



రాజస్థాన్ సికార్‌లో ఖాతూ శ్యామ్‌జీ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. -                                                           ప్రధాని నరేంద్ర మోదీ






ఈ ఘటనపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కూడా స్పందించారు. ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 16 వేల కరోనా కేసులు- 41 మంది మృతి


Also Read: Azadi Ka Amrit Mahotsav: ఆహారమే లేని దుస్థితి నుంచి ఆత్మనిర్భరత వరకూ, భారత్‌లో ఈ అద్భుతం ఎలా జరిగింది?

Published at: 08 Aug 2022 11:44 AM (IST)
Continues below advertisement
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.