పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఫిబ్రవరి 20న ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. వివిధ  రాజకీయ పార్టీల డిమాండ్ మేరకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం ఇందుకోసం భేటీ అయింది. గురు రవిదాస్ జయంతి ఉన్నందున ఎన్నికల తేదీ మార్చాలని కాంగ్రెస్, భాజపా, అకాలీదళ్ తదితర పార్టీలు కోరాయి. 







కొత్త షెడ్యూల్..


నోటిఫికేషన్ తేదీ: January 25, 2022 (మంగళవారం)


నామినేషన్ దాఖలుకు చివరి తేదీ: February 1, 2022 (మంగళవారం)


నామపత్రాల పరిశీలన: February 2, 2022 (బుధవారం)


నామపత్రాల ఉపసంహరణకు చివరి తేదీ: February 4, 2022 ( శుక్రవారం)


పోలింగ్ తేదీ: February 20, 2022 ( ఆదివారం)


ఓట్ల లెక్కింపు: March 10, 2022 ( గురువారం)







ఎందుకంటే?


ఫిబ్రవరి 16న రవిదాస్ జయంతి ఉంది. ఈ సందర్భంగా లక్షలాది మంది పంజాబీలు ఉత్తర్​ప్రదేశ్ వారణాసికి వెళ్తుంటారు. ఫిబ్రవరి 14న ఎన్నికలు నిర్వహిస్తే చాలా మంది తమ ఓటు హక్కును ఉపయోగించుకునే అవకాశం ఉండదని రాజకీయ పార్టీలు పేర్కొన్నాయి.


సీఎం లేఖ..


పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్​జిత్ సింగ్ చన్నీ కూడా ఈ విషయమై జనవరి 13న ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. రవిదాస్ జయంతి సందర్భంగా పంజాబ్ నుంచి చాలామంది ఉత్తర్‌ప్రదేశ్ వెళ్తారని చన్నీ అన్నారు. అందుకోసమే ఎన్నికలు వాయిదా వేయాలంటూ దళిత వర్గానికి చెందిన ప్రతినిధులు తనను కోరిన విషయాన్ని ఈసీ దృష్టికి సీఎం తీసుకెళ్లారు. రాష్ట్రంలో ఈ వర్గానికి చెందినవారు దాదాపు 32 శాతంగా ఉన్న విషయాన్ని కూడా ప్రస్తావించారు.


హోరాహోరీ..


ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ మధ్య హోరాహోరీ పోరు జరగనుందని ఇప్పటికే పలు సర్వేలు తెలిపాయి. అయితే ఆమ్ఆద్మీకి ఎక్కువ స్థానాలు వచ్చినా హంగ్ ఏర్పడే అవకాశం లేకపోలేదని ఏబీపీ-సీఓటర్ సర్వేలో తేలింది. ప్రస్తుతం పంజాబ్‌లో ఆమ్‌ఆద్మీ ప్రతిపక్ష పార్టీగా ఉంది. 


Also Read: Covid Vaccine for Children: గుడ్‌న్యూస్.. 12-14 ఏళ్ల పిల్లలకు అప్పటి నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ!


Also Read: Omicron Cases: భారత్‌లో కాస్త శాంతించిన కరోనా మహమ్మారి.. మరోవైపు 8 వేలు దాటిన ఒమిక్రాన్ కేసులు



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి