Bundelkhand Expressway UP: ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుని ప్రారంభించిన ప్రధాని మోదీ, బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌ వే రెడీ

యూపీలోని ప్రతిష్ఠాత్మక బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌ వే ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఏడేళ్లలో దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల సంఖ్య పెరిగిందని వెల్లడించారు.

Continues below advertisement

బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌ వే ప్రారంభం..

Continues below advertisement

ప్రధాని నరేంద్ర మోదీ యూపీలోని జలౌన్‌ జిల్లాలో బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌ వేను ప్రారంభించారు. ఈ 296 కిలోమీటర్ల ఫోర్ లేన్ రహదారి నిర్మాణానికి రూ.14,850 కోట్లు ఖర్చు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఎక్స్‌ప్రెస్‌ వేతో స్థానికంగా పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటవటమే కాకుండా కనెక్టివిటీ కూడా పెరగనుంది. చిత్రకూట్‌ను లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేతో అనుసంధానించే ఈ నాలుగు వరుసల రహదారికి 2020 ఫిబ్రవరి 29న ఫౌండేషన్ స్టోన్‌ వేశారు ప్రధాని మోదీ. ఉత్తర్‌ప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ వేస్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ(UPEIDA) నేతత్వంలో ఈ రహదారి నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతానికి 4 లేన్ హైవే అయినప్పటికీ...భవిష్యత్‌లో దీన్ని ఆరు వరుసలకు విస్తరించాలని చూస్తున్నారు. రహదారి భద్రత విషయంలోనూ ఏ మాత్రం వెనకాడకుండా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF)ను అందుబాటులో ఉంచుతారు. వీరితో పాటు పోలీసులు కూడా అందుబాటులో ఉంటారు.

 

ఏడేళ్లలో జాతీయ రహదారుల సంఖ్య పెరిగింది: కేంద్రం

మోదీ ప్రభుత్వం మౌలిక వసతులు అందించటంపైనే ఎక్కువగా దృష్టి సారించిందని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇటీవలి బడ్జెట్‌లో మునుపెన్నడూ లేని విధంగా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్, హైవేస్‌ మంత్రిత్వ శాఖకు రూ.1.99 లక్షల కోట్లు కేటాయించింది. 2013-14తో పోల్చి చూస్తే ఇది 550% ఎక్కువ అని కేంద్రం వివరిస్తోంది. ఏడేళ్లలో దేశంలో జాతీయ రహదారుల సంఖ్య 50% మేర పెరిగిందని వెల్లడించింది కేంద్రం. 2014 ఏప్రిల్ నాటికి 91,287 కిలోమీటర్ల జాతీయ రహదారులుండగా, 2021 డిసెంబర్ నాటికి ఈ సంఖ్య 1,41,000 కిలోమీటర్లకు పెరిగిందని లెక్కలతో సహా వివరిస్తోంది. 
 

 

Continues below advertisement
Sponsored Links by Taboola