Pak Major killed in Waziristan  who captured IAF pilot Abhinandan:  2019లో భారత వైమానిక దళ పైలట్ అభినందన్ వర్థమాన్‌ను బంధించడంలో పాత్ర పోషించిన పాకిస్థాన్ ఆర్మీ మేజర్ మోయిజ్ అబ్బాస్ షా   తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ ) ఉగ్రవాదులతో జరిగిన ఘర్షణలో మృతి చెందాడు. 

Continues below advertisement


పాకిస్థాన్ ఆర్మీలో స్పెషల్ సర్వీస్ గ్రూప్ (SSG)లో సభ్యుడైన మేజర్ మోయిజ్ అబ్బాస్ షా  దక్షిణ వజీరిస్థాన్‌లోని సరరోఘా తెహ్సీల్‌లో విధులు నిర్వహిస్తున్నడాు.   తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) ఉగ్రవాదులతో జరిగిన ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేషన్ (IBO)లో మృతి చెందారు.  ఈ ఆపరేషన్‌లో 11 మంది ఉగ్రవాదులు హతమైనట్లు, మరో ఏడుగురు గాయపడినట్లు పాకిస్థాన్ ఆర్మీ   ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) తెలిపింది.  



2019 ఫిబ్రవరి 14న జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది భారత పారామిలటరీ సిబ్బంది మరణించారు.  దీనికి ప్రతీకారంగా భారత వైమానిక దళం ఫిబ్రవరి 26న పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద శిక్షణ శిబిరంపై ఎయిర్‌స్ట్రైక్ నిర్వహించింది. తర్వాత ఫిబ్రవరి 27న పాకిస్థాన్ ఫైటర్ జెట్లు భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడానికి ప్రయత్నించాయి, దీనికి భారత వైమానిక దళం ప్రతిస్పందించింది. ఆ విమానాలను తరిమికొడుతూ అప్పటి వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్   మిగ్-21 బైసన్‌లో ఉండగా, పాకిస్థాన్ ఎఫ్-16 ఫైటర్ జెట్‌ను కూల్చివేశారు. అయితే, ఆయన విమానం కూడా  పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో కూలిపోయిది.                    


అభినందన్‌ను మేజర్ మోయిజ్ అబ్బాస్ షా నేతృత్వంలోని పాకిస్థాన్ ఆర్మీ యూనిట్ బంధించింది. ఈ సంఘటన భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను పెంచింది.  మోయిజ్ అబ్బాస్ షా అభినందన్‌ను హింసించాడని ఆరోపణలు వచ్చాయి. అయితే అలాంటిదేం జరగలేదని తర్వాత తెలిసిది.  భారత ప్రభుత్వం టి దౌత్యపరమైన ఒత్తిడి ,  అంతర్జాతీయ జోక్యం తర్వాత, పాకిస్థాన్ అప్పటి ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఫిబ్రవరి 28న అభినందన్ ను విడుదల చేయించారు.  అభినందన్ 58 గంటల తర్వాత, మార్చి 1, 2019న అట్టారీ-వాఘా సరిహద్దు ద్వారా భారత్‌కు తిరిగి వచ్చారు. మేజర్ మోయిజ్ అబ్బాస్ షా పాకిస్థాన్ ఆర్మీలో ఎలైట్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ (SSG)లో సభ్యుడిగా, అలాగే 7 నార్తర్న్ లైట్ ఇన్‌ఫాంట్రీ (NLI), 6 కమాండో బెటాలియన్ (CDO)లో సేవలు అందించారు.