Mainpuri Bypolls: అఖిలేశ్ అలా కావాలంటే మరో 10 జన్మలెత్తాలి: యూపీ డిప్యూటీ సీఎం

ABP Desam Updated at: 28 Nov 2022 10:59 AM (IST)
Edited By: Murali Krishna

Mainpuri Bypolls: సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌పై యూపీ డిప్యూటీ సీఎం తీవ్ర విమర్శలు చేశారు.

అఖిలేశ్ అలా కావాలంటే మరో 10 జన్మలెత్తాలి: యూపీ డిప్యూటీ సీఎం

NEXT PREV

Mainpuri Bypolls: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మెయిన్‌పురి ఉపఎన్నికల ప్రచారం వాడీవేడిగా సాగుతోంది. పార్టీ ప్రచారం కోసం నవంబర్ 27న మెయిన్‌పురి చేరుకున్న యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య.. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు.







ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తన తండ్రి ములాయం సింగ్ యాదవ్ లాగా మారడానికి మరో 10 జన్మలు ఎత్తాలి. తన తండ్రిని పార్టీ చీఫ్ పదవి నుంచి తప్పించి అఖిలేష్ యాదవ్ ఆ పదవిని లాగేసుకున్నారు.  -                                                     కేశవ్ ప్రసాద్ మౌర్య, యూపీ డిప్యూటీ సీఎం


డింపుల్ యాదవ్


మరోవైపు మెయిన్‌పురి ఉప ఎన్నికలకు ముందు భాజపా సర్కార్ తమ పార్టీ స్థానిక నాయకులను అణచివేస్తుందని సమాజ్‌వాదీ పార్టీ నేత డింపుల్ యాదవ్ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో మెయిన్‌పురి నుంచి బరిలోకి దిగిన డింపుల్ యాదవ్.. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.



మెయిన్‌పురి నియోజకవర్గం అభివృద్ధికి సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కృషి చేశారు. రాబోయే ఉప ఎన్నికల్లో పార్టీ ఈ వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంది. డిసెంబర్ 4న మన పార్టీ కార్యకర్తలపై అధికార యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తుంది. కనుక డిసెంబర్ 4న మీ ఇళ్లలో పడుకోకండి. డిసెంబర్ 5న మిమ్మల్ని ఎవరూ తాకలేరు. ఆ రోజు స్వేచ్ఛగా మీ ఓటు హక్కు వినియోగించుకోండి. డిసెంబర్ 6న ఇక్కడి నుంచి పరిపాలన యంత్రాంగం కనుమరుగవుతుంది.                             -    డింపుల్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి
   


డింపుల్‌కే ఓటు


అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్‌.. మెయిన్‌పురి ఉప ఎన్నికల బరిలో నిలిచారు. మెయిన్‌పురి లోక్‌సభ నియోజకవర్గానికి జరిగే ఉపఎన్నికలకు డింపుల్ యాదవ్‌ను సమాజ్‌వాదీ పార్టీ రంగంలోకి దింపింది. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మరణంతో మెయిన్‌పురి లోక్‌సభ స్థానం ఖాళీ అయింది.


ఈ స్థానానికి తొలుత అఖిలేశ్ బంధువు ధర్మేంద్ర యాదవ్ లేదా ఆయన మేనల్లుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌ బరిలోకి దిగుతారని అంతా భావించారు. అయితే చివరకు డింపుల్ యాదవ్‌ పేరును ఖరారు చేశారు. ఈ స్థానానికి డిసెంబరు 5న పోలింగ్ జరగనుంది. ఫలితాలు డిసెంబర్ 8న వెల్లడిస్తారు.


కంచుకోట


మెయిన్‌పురి సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటగా ఉంది. 1996లో ములాయం తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన మరో మూడుసార్లు 2004, 2009, 2019లో ఈ స్థానం నుంచి విజయం సాధించారు. 2014 ఉప ఎన్నికలో అఖిలేశ్ మేనల్లుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఈ సీటును గెలుచుకున్నారు. ములాయం సింగ్ లేకుండా సమాజ్‌వాదీ పార్టీ ఎదుర్కోబోతున్న తొలి ఎన్నిక ఇదే.


Also Read: Mehbooba Mufti: ఇండియా అంటే బీజేపీ కాదు, ఎలా తరిమి కొట్టాలో కశ్మీరీలకు తెలుసు - మెహబూబా ముఫ్తీ

Published at: 28 Nov 2022 10:56 AM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.