Liquor Seized: రాష్ట్రంలో మద్యం బంద్- అధికార పార్టీ నేత ఇంట్లో మాత్రం ఫుల్ పటాస్!

ABP Desam   |  Murali Krishna  |  21 Dec 2022 01:59 PM (IST)

Liquor Seized: బిహార్‌లో అధికార జేడీయూ నేత ఇంట్లో భారీ సంఖ్యలో మద్యం సీసాలు లభించాయి.

Liquor Seized: రాష్ట్రంలో మద్యం బంద్- అధికార పార్టీ నేత ఇంట్లో మాత్రం ఫుల్ పటాస్!

అధికార పార్టీ నేత ఇంట్లో మాత్రం ఫుల్ పటాస్!

Liquor Seized: బిహార్‌లో కల్తీ మద్యం తాగి ప్రజలు మరణిస్తూనే ఉన్నా పరిస్థితులు మారడం లేదు. 2016 ఏప్రిల్ నుంచే బిహార్‌లో మద్య నిషేధం అమలవుతోంది.. కానీ రాష్ట్రంలో తరచుగా ఎక్కడో ఒక చోట లిక్కర్ లభిస్తూనే ఉంది. తాజాగా అధికార పార్టీకే చెందిన ఓ నాయకుడు ఇంట్లో భారీ సంఖ్యలో మద్యం సీసాలు లభించాయి.

ఇంట్లో

మర్హౌరాలోని అధికార జేడీయూ నాయకుడు, స్టేట్‌ కౌన్సిల్‌ సభ్యుడైన కామేశ్వర్‌ ఇంటిపై పోలీసులు, ఎక్సైజ్‌ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీగా దేశీయ, విదేశీ బ్రాండ్‌లకు చెందిన మద్యం సీసాలు లభించాయి. దీంతో అధికారులు వాటిని సీజ్‌ చేశారు.

సరోజ్ మహ్తో అనే వ్యక్తి తన భార్యతో పాటు ఆ ఇంట్లో రెంట్‌కు ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఒక మహిళను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. 

నాకు తెలియదు

ఈ ఘటనపై జేడీయూ నేత కామేశ్వర్ వింతగా సమాధానమిచ్చారు. ఈ ఘటన గురించి మీడియా ద్వారానే తనకు తెలిసిందన్నారు.

ఈ విషయం నాకు మీడియా ద్వారా తెలిసింది. 32 సంవత్సరాల క్రితం నేను ఆ ఇంటిని విడిచిపెట్టాను. మా ప్రభుత్వం పరువు తీసేందుకు ఆ బాటిళ్లను అక్కడ ఎవరు ఉంచారో దర్యాప్తు చేయాలి. - కామేశ్వర్ సింగ్, జేడీయూ నేత

పరిహారం ఇవ్వం

గత వారం అక్రమ మద్యం తాగడంతో రాష్ట్రంలో 70 మందికిపైగా మరణించారు. బిహార్‌లో చప్రా, సివాన్‌ జిల్లాల్లో కల్తీ మద్యం తాగి పదుల సంఖ్యలో ప్రాణనష్టం జరిగింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ అంశంపై అసెంబ్లీలో భాజపా, నితీశ్ సర్కార్ మధ్య ఇటీవల వాగ్వాదం జరిగింది. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ మరణాలన్నీ...అంటూ భాజపా తీవ్ర స్థాయిలో విమర్శించింది. అటు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా గట్టిగానే బదులిచ్చారు. 

మద్య నిషేధం పకడ్బందీగా అమలు చేస్తున్నాం. మద్యం సేవించిన వాళ్లెవరైనా సరే ఇలాగే ప్రాణాలు కోల్పోతారు. మద్యం సేవించి ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం తరపున పరిహారం కూడా ఇవ్వం. మేం ఎప్పటి నుంచో ఇదే చెబుతున్నాం. మద్యపానం గురించి సానుకూలంగా మాట్లాడే వాళ్లతో మీకు కలిగే ప్రయోజనమేమీ లేదు.                                                     -  నితీశ్ కుమార్, బిహార్ సీఎం

Also Read: Taj Mahal News: తాజ్‌మహల్‌కు పన్ను ఉంటుందా? నోటీసులు ఎందుకు వచ్చాయ్?

Published at: 21 Dec 2022 01:52 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.