Lakhimpur Kheri Incident LIVE: సీతాపుర్‌కు చేరుకున్న రాహుల్ గాంధీ.. ప్రియాంకతో కలిసి లఖింపుర్‌కు పయనం

రాహుల్ గాంధీ సహా ఛత్తీస్‌గఢ్, పంజాబ్ సీఎంలు ఉత్తర్‌ప్రదేశ్‌ పర్యటనకు బయలుదేరారు. అయితే వీరిని లఖ్‌నవూ ఎయిర్‌పోర్ట్‌లోనే అడ్డుకుంటామని పోలీసులు తెలిపారు.

ABP Desam Last Updated: 06 Oct 2021 05:36 PM
సీతాపుర్‌కు చేరుకున్న రాహుల్ గాంధీ..

రాహుల్ గాంధీ బృందం సీతాపుర్‌కు చేరుకుంది. ఈ బృందంతో ప్రియాంక గాంధీ కలిసి లఖింపుర్ ఖేరీ వెళ్లనున్నారు. గత 3 రోజులుగా ప్రియాంక గాంధీ యూపీ ప్రభుత్వం అతిథి గృహంలో నిర్బంధించింది.  





బాధితులకు అండగా..

లఖింపుర్ ఘటనలో మరణించిన రైతులు, జర్నలిస్టు కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున ప్రకటించాయి ఛత్తీస్‌గఢ్, పంజాబ్ ప్రభుత్వాలు. ఈ మేరకు ఇరు రాష్ట్రాల సీఎంలు ప్రకటించారు.










 




రాహుల్ గాంధీ ధర్నా..

" లఖింపుర్‌ ఖేరీకి మా వాహనంలో వెళ్లాలనుకుంటున్నాం. కానీ పోలీసులు వారి వాహనంలో తీసుకువెళ్తానంటున్నారు. నా వాహనంలో వెళ్లేందుకు అనుమతించాలని కోరాను. కానీ వాళ్లు ఒప్పుకోలేదు. ఇక్కడే కూర్చున్నాను.                           "
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత





రాహుల్‌ను అడ్డుకున్న పోలీసులు..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని లఖ్‌నవూ విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారు. సొంత వాహనంలో లఖింపుర్ వెళ్తానని రాహుల్ కోరగా అందుకు పోలీసులు నిరాకరించారు. తమ వాహనంలోనే తీసుకువెళ్తామని తెలిపారు. అయింతే ఇందుకు అంగీకరించని రాహుల్ విమానాశ్రయంలోనే ధర్నాకు దిగారు.


.





లఖ్‌నవూ చేరుకున్న రాహుల్..

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లఖ్‌నవూ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనతో పాటు ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్ బఘేల్, పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ, కేసీ వేణుగోపాల్, రణ్‌దీప్ సుర్జేవాలా ఉన్నారు. 





నిరసన..

ఛండీగఢ్‌లోని రాజ్‌భవన్ ఎదుట లఖింపుర్ ఘటనను నిరసనిస్తూ ఆమ్‌ఆద్మీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. వీరిపై పోలీసులు జలఫిరంగులను ప్రయోగించారు.





ఎట్టకేలకు అనుమతి..

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా మరో ముగ్గురికి లఖింపుర్‌ ఖేరీలో పర్యటించేందుకు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు యూపీ హోంశాఖ వెల్లడించినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ వెల్లడించింది.


 





రాహుల్‌ గాంధీని అడ్డుకుంటాం..

రాహుల్ గాంధీ బృందాన్ని ఎయిర్‌పోర్ట్‌లోనే అడ్డుకుంటామని లఖ్‌నవూ పోలీస్ కమిషనర్ వెల్లడించారు.


" రాహుల్ గాంధీ పర్యటనకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఆయన లఖ్‌నవూ వస్తే లఖింపుర్‌, సీతాపుర్‌లో పర్యటించొద్దని కోరతాం. శాంతి, భద్రతల దృష్ట్యా రాహుల్ గాంధీని అడ్డుకోవాలని లఖింపుర్, సీతాపుర్ ఎస్పీ, డీఎమ్ మమ్మల్ని కోరారు.                                 "
- డీకే ఠాకూర్, లఖ్‌నవూ పోలీస్ కమిషనర్





Background

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లఖింపుర్ ఖేరీకి వెళ్లేందుకు పయనమయ్యారు. ఆయనతో పాటు ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ కూడా ఉన్నారు. వీరు ముగ్గురు లఖింపుర్ ఖేరీ ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు.






అయితే వీరి పర్యటనకు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అనుమతి నిరాకరించింది. అయినప్పటికీ రాహుల్ పర్యటిస్తానని తేల్చిచెప్పారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.