కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్​ మిశ్రా కుమారుడు ఆశిష్​ మిశ్రాకు 3 రోజుల పోలీస్​ రిమాండ్​ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్​ప్రదేశ్​ లఖింపుర్​ ఖేరి ఘటనలో ఆశిష్ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసుకు సంబంధించి సోమవారం విచారణ చేపట్టింది న్యాయస్థానం.






విచారణకు సహకరించట్లేదు..


ఈనెల 9న 12 గంటల పాటు ఆశిష్‌ను విచారించారు పోలీసులు. అనంతరం ఆశిష్​ మిశ్రాను అరెస్ట్​ చేశారు. ఆశిష్‌పై సెక్షన్ 302, 304ఏ, 147, 148, 149, 279, 120బీల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే నిందితుడు దర్యాప్తునకు సహకరించట్లేదని పోలీసులు పేర్కొన్నారు. ఈ కారణంగా పోలీస్​ రిమాండ్​కు అనుమతించాలని కోరుతూ కోర్టుకు దరఖాస్తు చేశారు.


ఆశిష్ ఏ తప్పూ చేయలేదని.. ఘటనకు సంబంధించిన 100కు పైగా ఫొటోలను, వీడియోలను పోలీసులకు ఇప్పటికే అందించామని నిందితుడి తరఫు న్యాయవాది తెలిపారు.


ఇదీ ఘటన..


కేంద్రం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలపై నిరసన వ్యక్తం చేస్తోన్న రైతులపైకి ఓ వాహనం దూసుకెళ్లిన ఘటనలో నలుగురు అన్నదాతలు ప్రాణాలు కోల్పోయారు. ఆ హింసాత్మక ఘటనలో మరో ఇద్దరు భాజపా కార్యకర్తలు, ఓ డ్రైవర్ సహా ఓ జర్నలిస్ట్ ప్రాణాలు కోల్పోయాడు. ఆగ్ గత ఆదివారం జరిగిన ఈ ఘటన యావత్ దేశాన్నే షాక్‌కు గురి చేసింది.


అయితే రైతులపైకి దూసుకువచ్చిన కారులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఉన్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను అజయ్ మిశ్రా ఖండించారు.


Also Read: PM Modi Launches ISPA: అంతరిక్ష రంగంలో సంస్కరణలు అందుకే చేశాం: ప్రధాని మోదీ


Also Read: ఈ కాంబినేషన్‌ ఫుడ్స్‌ని పొరపాటున కూడా కలిపి తినకండి... స్లో పాయిజన్ అయ్యే అవకాశం ఉంది


Also Read: Aryan Khan Drug Case: ఆర్యన్‌ ఖాన్‌కు మూడోసారి కూడా బెయిల్ నిరాకరణ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి