భారత్ లో దేవాలయాలు ప్రసిద్ధి. దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత భక్తులకు ప్రసాదాలు ఇస్తుంటారు. కొన్ని దేవాలయాల్లో ప్రసాదం భక్తులకు అమిత ప్రియం. తిరుపతి, అన్నవరం, కేరళ అయ్యప్ప స్వామి దేవాలయాల ప్రసాదాలు చాలా ప్రసిద్ధి. కానీ కోల్ కతాలోని ఓ దేవాలయంలో వింత ఆచారం ఉంది. అక్కడ న్యూడిల్స్, సూప్ ప్రసాదంగా అందజేస్తారు.      


Also Read: Odisha News: చావైనా నీతోనే... భార్య చితిలో దూకిన భర్త... ఒడిశాలో పతీసహగమనం


చైనీస్ టౌన్...


కోల్ కతా కాళీమాత గుడిని ప్రతిరోజు వందల మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ దేవాలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ పూజా కార్యక్రమం అనంతరం సూప్, నూడిల్స్​  ప్రసాదంగా ఇస్తారు. పశ్చిమ బంగాల్​లోని కోల్​కతా మహానగరంలో భిన్న సంస్కృతులకు నెలవు. ఇక్కడ చైనీస్ టౌన్​గా పిలిచే టాంగ్రా ప్రాంతంలో కాళీమాత ఆలయం ఉంది. దీన్ని 'చైనీస్ కాళీ టెంపుల్' అని పిలుస్తారు. ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే ప్రసాదంగా సూప్, నూడిల్స్, స్టిక్కీ రైస్ లాంటివి ప్రసాదంగా భక్తులకు అందిస్తారు. చైనా, జపాన్, హాంకాంగ్ దేశాలను పోలినట్లు ఉండే ఈ ప్రాంతానికి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. 


Also Read: Bullet Bandi Song: బుల్లెట్టు బండి పాటకి టీఆర్ఎస్ ఎంపీ కవిత దరువు.. ఆమె స్టెప్పులకు ఆశ్చర్యపోయిన జనం, వీడియో వైరల్


 



బాలుడి కథ...


చైనీయులు ఈ ప్రాంతంలో చాలా ఏళ్లగా నివాసం ఉంటున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న కాళీ టెంపుల్ లో  భారత-చైనీస్ సంప్రదాయలు పాటిస్తుంటారు. దాదాపు 20 ఏళ్ల నుంచి ఇక్కడ నెలకొన్న ప్రత్యేక సంస్కృతి పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తోంది. గతంలో ఈ ప్రాంతంలో నివసిస్తున్న చైనీస్ పిల్లాడికి అనారోగ్యం చేసింది. అతడి తల్లిదండ్రులు ఎంతో మంది వైద్యులకు చూపించిన ఫలితం లేదు. ఆ సమయంలో ఈ దేవాలయంలో కాళీమాతకు పూజ చేశాక కొన్నిరోజుల తర్వాత ఆ పిల్లాడి ఆరోగ్యం కుదుటపడిందని ఓ కథ ప్రచారంలో ఉంది. అప్పటి నుంచి నమ్మకం ఏర్పడి, ఈ గుడిని వలస వచ్చిన చైనీయులు జాగ్రత్తగా చూసుకుంటున్నారు. 


 


Also Read: Afganisthan Crisis: అఫ్గాన్ పరిస్థితులపై అఖిలపక్ష భేటీ.. హాజరైన పలువురు నేతలు


Also Read: Afghanistan Crisis: అఫ్గాన్ లో రెచ్చిపోతున్న తాలిబన్లు.. రిపోర్టర్ పై విచక్షణారహితంగా దాడి