Kerala Crime News: కేరళలో దారుణం- రోడ్డుపై ప్రియురాలిని నరికి చంపిన ప్రియుడు!

ABP Desam Updated at: 15 Dec 2022 04:13 PM (IST)
Edited By: Murali Krishna

Kerala Crime News: కేరళలో ఓ వ్యక్తి తన ప్రియురాలిని రోడ్డుపై కొడవలితో నరికి చంపాడు.

(Image Source: AFP)

NEXT PREV

Kerala Crime News: దేశంలో సంచలనం సృష్టించిన దిల్లీ శ్రద్ధా వాకర్ హత్య కేసు మరువకముందే అలాంటి మరో సంఘటన కేరళలో జరిగింది. రాజధాని తిరువనంతపురంలో జరిగిన ఈ ఘటనలో రెండు సంవత్సరాలుగా సహజీవనం సాగిస్తున్న ప్రియురాలిని.. ప్రియుడు పట్టపగలే కిరాతకంగా నరికి చంపాడు.






ఎందుకు?


తిరువనంతపురంలో గురువారం పట్టపగలే ఈ ఘటన జరిగింది. నిందితుడు రాజేష్ తన ప్రియురాలు సింధూతో ఏదో విషయంలో వచ్చిన తగాదాల కారణంగా పెరూర్కడ ప్రధాన రహదారిపై కొడవలితో నరికి చంపడానికి ప్రయత్నించాడు. తీవ్ర గాయాలపాలైన సింధూను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు.


నిందితుడు రాజేష్ తిరువనంతపురం శివార్లలో జూస్ సెంటర్ నిర్వహించేవాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన గురించి వార్తా సంస్థ ఏఎన్ఐ ట్విట్టర్ లో వెల్లడించింది.



సింధూ అనే మహిళను తనతో సహా జీవనం చేస్తున్న ఆమె ప్రియుడు రాజేష్ నరికి చంపాడు. ప్రస్తుతం నిందితుడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు. వారిరువురు గత రెండు సంవత్సరాలుగా సహజీవనం సాగిస్తున్నారు. వ్యక్తిగత విభేదాల కారణంగా రాజేష్ ఆమెను కొడవలితో నరికాడు. తీవ్ర గాయాలపాలైన సింధూను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించిందని వైద్యులు తెలిపారు.                                        -  పోలీసులు


దిల్లీలో


ఇటీవల దిల్లీలో ఇదే తరహా ఘటన జరిగింది. సహజీవనం చేస్తోన్న తన ప్రియురాలు శ్రద్ధాను.. అఫ్తాబ్ పూనావాలా అత్యంత కిరాతకంగా నరికి చంపాడు. అనంతరం తన శరీరాన్ని ముక్కులుగా నరికి అడివిలో విసిరేశాడు. మే లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


శ్రద్ధ, అఫ్తాబ్.. ముంబయిలోని ఓ కాల్ సెంటర్‌లో పనిచేశారు. అక్కడ వారు మొదట కలుసుకున్నారు. తరువాత డేటింగ్ ప్రారంభించారు. ఆమె కుటుంబం వారి సంబంధాన్ని ఆమోదించకపోవడంతో ఈ జంట దిల్లీకి పారిపోయి లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో జీవిస్తున్నారు.అయితే శ్రద్ధా తల్లిదండ్రులు మాత్రం.. ఆమె సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా తమ కుమార్తె యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు.


కానీ చాలా కాలంగా ఆమె సోషల్ మీడియా ఖాతాలో ఎటువంటి అప్‌డేట్ రాకపోవడంతో శ్రద్ధ తండ్రి దిల్లీకి వచ్చారు. తన కూతురు వివరాలు తెలియకపోవడంతో ఆమె తండ్రి దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


తన కుమార్తె ముంబయిలోని కాల్ సెంటర్‌లో పనిచేసేదని, అక్కడ అఫ్తాబ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడిందని, వారి స్నేహం సన్నిహితంగా మారిందని శ్రద్ధ తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడటం ప్రారంభించారని, అయితే కుటుంబం దానిని అంగీకరించలేదని శ్రద్ధా తండ్రి ఆరోపించారు. దీంతో అతని కూతురు, అఫ్తాబ్ ముంబయి వదిలి దిల్లీకి వచ్చి ఇక్కడి ఛతర్‌పుర్ ప్రాంతంలో ఉంటున్నట్లు తెలిపారు. ఆయన ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిఘా ద్వారా అఫ్తాబ్‌ను పట్టుకున్నారు.


అఫ్తాబ్‌ను ప్రశ్నించగా, అమ్మాయి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తోందని, దీని వల్ల వారి మధ్య తరచూ గొడవలు జరగినట్లు తెలిపాడు. మే నెలలో శ్రద్ధాను దారుణంగా చంపి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి.. నగరంలోని పలు ప్రాంతాల్లో పారేసినట్లు ఒప్పుకున్నాడు.


Also Read: Tamil Nadu Road Accident: ఇలా కూడా యాక్సిడెంట్ అవుతుందా?- అమాంతం ఎగిరి పడిన బైకర్!

Published at: 15 Dec 2022 04:09 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.