టసింహ నందమూరి బాలకృష్ణ రీసెంట్ గా నటిస్తోన్న సినిమా ‘వీర సింహారెడ్డి’. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే దాదాపు షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. శృతి హాసన్ ఈ మూవీలో హిరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి కొత్త సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. ‘చీమా కుట్టిందే.. ప్రేమా పుట్టిందే’ అంటూ సాగే ఈ పాటను రామ జోగయ్య శాస్త్రి రాశారు. రామ్‌ మిర్యాల, స్నిగ్ధ శర్మ ఆలపించారు. ఎస్.థమన్ మ్యూజిక్ అందించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ పాటలో బాలయ్య చాాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు. శృతి హాసన్ కూడా మల్టీ కలర్ డ్రెస్ లలో ఆకట్టుకుంటుంది. పాటలో బాలయ్య తన డాన్స్ స్టెప్పులతో మరోసారి అలరించారు. గతంలో ‘జై బాలయ్య’ లాంటి మాస్ సాంగ్ ను విడుదల చేయగా.. ఇప్పుడు ‘సుగుణ సుందరి’ డ్యూయెట్ సాంగ్ ను విడుదల చేశారు. 



సంగీత దర్శకుడు థమన్ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు. వరుసగా పెద్ద ప్రాజెక్టులకు పని చేస్తున్నాడు. ఈ సినిమాకు కూడా థమన్ గట్టిగానే మ్యూజిక్ అందించారని టాక్. అయితే ఇటీవల సినిమా నుంచి విడుదల చేసిన ‘జై బాలయ్య’ పాటకు మిశ్రమ స్పందన వచ్చింది. సోషల్ మీడియాలో ఈ పాటపై ఫుల్ ట్రోలింగ్ కూడా జరిగింది. కొందరు పాట చాలా బాగుందని కామెంట్ చేస్తే ఇంకొంత మంది ఈ పాట ‘ఒసేయ్ రాములమ్మా’ సినిమాలో టైటిల్ సాంగ్ నుంచి థమన్ ట్యూన్ కాపీ కొట్టి ఈ పాట చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై నెట్టింట పెద్ద చర్చే నడిచింది. అయితే ఇప్పుడు వచ్చిన పాట మాత్రం కొత్తగానే ఉన్నట్టు తెలుస్తోంది. మరి సోషల్ మీడియాలో దీనిపై ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. 



Read Also: బాలీవుడ్ సినిమాల పతనానికి కారణం వాళ్లే, దర్శకుడు రాజమౌళి సంచనల వ్యాఖ్యలు



ఇక ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ మూవీ ను భారీగా నిర్మిస్తున్నారు.  ఈ యేడాది ప్రారంభంలో ‘క్రాక్’ సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అటు బాలకృష్ణ కూడా ‘అఖండ’ లాంటి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ తర్వాత చేస్తోన్న సినిమా కావడంతో మూవీ పై ఉత్కంఠ నెలకొంది. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా చేశారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫర్ గా చేస్తున్నారు. రామ్-లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ గా చేస్తున్నారు. బాలయ్య ‘వీర సింహారెడ్ది’ వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. మరి ఈ సినిమా సంక్రాంతికి ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.