హైవేలో యాక్సిడెంట్ అయితే వెళ్లిపోయేవాళ్లు కూడా గుమిగూడి చూస్తుంటారు. అయితే ఓ నేషనల్ హైవేపై వేగంగా వెళ్తున్న వాహనదారులు.. సడెన్ గా వాహనాలు ఆపి మరి వింతగా ఓ దృశ్యాన్ని చూస్తుండిపోయారు. ఎందుకో తెలుసా? నిత్యం వేలాది వాహనాలు, ప్రజలు తిరిగే జాతీయ రహదారిపై వందల సంఖ్యలో కండోమ్​లు కనిపిస్తే మరి ఆశ్చర్యమే కదా?


ఎవరైనా పడేశారా?


కర్ణాటక తుముకూర్​ శివారులోని జాతీయ రహదారి 48పై వందల సంఖ్యలో కండోమ్ లు దర్శనమిచ్చాయి. ఇది చూసి అటుగా వెళ్లే వాహనదారులు ఆశ్చర్యపోయారు. శ్రీరాజ్​ థియేటర్​కు ఎదురుగా ఉన్న ఓ ఫ్లైఓవర్​పై కండోమ్​లు కుప్పలుగా కనిపించాయి. అయితే ఇవి ఎవరైనా పారేశారా లేక ఏదైనా వాహనంలో తరలిస్తున్నప్పుడు పడిపోయాయో తెలియలేదు.



అయితే ఇందులో కొన్ని వినియోగించిన కండోమ్ లు ఉండగా.. మరికొన్ని ప్యాకెట్లలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంపై అధికారులు ఇప్పటివరకు స్పందిచలేదు. నిత్యం రద్దీగా తిరిగే ప్రదేశాల్లోనే ఇలా ఉంటే నిర్జన ప్రాంతాల్లో పరిస్థితేంటని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు.