Uttar Pradesh Road Accident: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బరేలి ఫతేగంజ్‌లో అంబులెన్స్‌ను ట్రక్కు ఢీకొంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు.






ఇదీ జరిగింది


భోజిపుర నుంచి దిల్లీ వెళుతున్న అంబులెన్స్ అదుపు తప్పి డివైడర్​ను​ దాటి​ ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు మృతి చెందారు. అంబులెన్స్​ డ్రైవర్​ నిద్రమత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


సీఎం దిగ్భ్రాంతి


ఈ ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.


Also Read: Indian Railways: ఎంత పని చేశావ్ సామీ- రూ.35 కోసం ఐదేళ్ల పోరాటం- రైల్వేశాఖకు షాక్!


Also Read: PMEGP: ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం పొడిగింపు- 40 లక్షల మందికి ఉద్యోగాలు!