Nupur Sharma Case: నుపుర్ శర్మపై సుప్రీం కోర్టు ఫైర్- 'దేశానికి ఆమె క్షమాపణలు చెప్పాల్సిందే'

ABP Desam Updated at: 01 Jul 2022 12:15 PM (IST)
Edited By: Murali Krishna

Nupur Sharma Case: నుపుర్ శర్మ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

దేశ ప్రజలకు నుపుర్ శర్మ క్షమాపణలు చెప్పాలి: సుప్రీం కోర్టు ఆగ్రహం

NEXT PREV

Nupur Sharma Case: మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భాజపా మాజీ నేత నుపుర్‌ శర్మపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ ప్రజలకు ఆమె క్షమాపణలు చెప్పాలని సుప్రీం తెలిపింది.


తనకు ఉన్న ప్రాణ హాని, అత్యాచార బెదిరింపులు వస్తున్నందున దేశవ్యాప్తంగా తనకు వ్యతిరేకంగా దాఖలైన కేసుల ఎఫ్‌ఐఆర్‌లను దిల్లీకి బదిలీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ నుపుర్ శర్మ సుప్రీం కోర్టులో ఓ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా. భాజపా బహిష్కృత నేతపై సుప్రీం కోర్టు మండిపడింది.



నుపుర్ శర్మ నోటి దురుసు.. దేశాన్ని రావణ కాష్టంలా మార్చింది. ఆమె వ్యాఖ్యలే ఉదయ్‌పుర్ ఘటనకు కారణం. నుపుర్ శర్మ యావత్ దేశానికి క్షమాపణలు చెప్పాల్సిందే. ఒక అజెండాను ప్రచారం చేయడం తప్ప, టీవీ ఛానల్, నుపుర్ శర్మల డిబేట్‌ వల్ల దేశానికి ఒరిగిందేంటి?                                                                    - సుప్రీం ధర్మాసనం


ప్రాణ హానిపై


సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై నుపుర్ శర్మ తరఫు లాయర్ మణిందర్ సింగ్ స్పందిస్తూ ఆమెకు ప్రాణహాని ఉందని ధర్మాసనానికి తెలిపారు. మహ్మద్ ప్రవక్తపై ఆమె చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికే క్షమాపణలు చెప్పారని గుర్తు చేశారు. అయితే దీనిపై కూడా సుప్రీం కోర్టు ఫైర్ అయింది.



అయితే ఆమె అదే టీవీ ముందుకు వచ్చి యావత్‌ దేశానికి క్షమాపణలు చెప్పాల్సి ఉంది. కానీ అప్పటికే ఆలస్యం అయ్యింది. ఆమె ప్రాణానికి ముప్పు ఏర్పడిందా? ఆమె వల్ల దేశం రగిలిపోతోంది. దేశమంతటా భావోద్వేగాలను ఆమె రగిలించిన విధానం, దేశంలో జరుగుతున్న ఘటనలకు ఆమెదే బాధ్యత.                                                           -     సుప్రీం కోర్టు


దిల్లీ పోలీసులపై


నుపుర్ శర్మపై ఫిర్యాదు నమోదై ఇన్ని రోజులు అవుతుంటే దిల్లీ పోలీసులు ఏం చేశారని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.



ఆమె ఫిర్యాదు మీద ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. మరి ఆమెపై ఎన్నో ఎఫ్‌ఐఆర్‌లు అందినా ఎందుకు ఆమెను టచ్‌ చేయలేకపోయారు.                                                                              -     సుప్రీం కోర్టు


నుపుర్ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేస్తూ ఈ కేసులో సంబంధిత హైకోర్టును ఆశ్రయించాలని ఆమె తరపు న్యాయవాదికి సుప్రీంకోర్టు సూచించింది.


Also Read: Indian Railways: సింగిల్ ఛాయ్‌కు రూ.70 వసూలు చేసిన రైల్వేశాఖ- ఎందుకో తెలుసా?



Also Read: LPG Cylinder Price: గుడ్ న్యూస్-కమర్షియల్ సిలిండర్ ధర తగ్గింది, ఎంతంటే?



 

Published at: 01 Jul 2022 11:39 AM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.