ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ మృతిపై ప్రముఖులు స్పందిస్తున్నారు. ఆమెతో మోదీకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ భావోద్వేగమైన ట్వీట్లు చేస్తున్నారు.  


కోట్లాది మంది మీతోనే ఉన్నారు: కేంద్ర హోంమంత్రి అమిత్ షా
'హీరాబా ఎదుర్కొన్న పోరాటాలు, కుటుంబాన్ని పెంచి పోషించిన విధానం అందరికీ రోల్ మోడల్' అని హోంమంత్రి అమిత్ షా ట్వీట్‌ చేశారు. ఆమె త్యాగ జీవితం ఎప్పటికీ మన స్మృతిలో నిలిచిపోతుంది. ఈ దు:ఖ సమయంలో యావత్ దేశం ప్రధాని మోదీ, ఆయన కుటుంబ సభ్యులకు తోడుగా నిలుస్తోంది. మీ కోసం కోట్లాది మంది ప్రజలు ప్రార్థనలు చేస్తారు. ఓం శాంతి.


కొడుక్కి తల్లే ప్రపంచం: యోగి ఆదిత్యనాథ్
ప్రధాని మోదీ తల్లి మృతి పట్ల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "కొడుక్కి తల్లే ప్రపంచం. తల్లి మరణం కొడుకుకు భరించలేని బాధ, కోలుకోలేని నష్టం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి మృతి చెందడం చాలా బాధ కలిగించింది. శ్రీరాముడు దివంగత పుణ్యాత్మకు ఆయన పాదాల వద్ద స్థానం ఇస్తాడు. ఓం శాంతి!" అని ట్వీట్ యోగి ఆదిత్యనాథ్‌ ట్వీట్ చేశారు. 


సుశీల్ కుమార్ మోడీ సంతాపం 
బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ తల్లి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


రాబర్ట్ వాద్రా విచారం 
ప్రధాని మోడీ తల్లి మృతి పట్ల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


యూపీ బీజేపీ అధ్యక్షుడు భూపేందర్ సింగ్ చౌదరి దిగ్భ్రాంతి  
ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ చౌదరి ట్వీట్ చేస్తూ ప్రధాన సేవక్ నరేంద్ర మోడీ ప్రాణదాత హీరాబెన్‌  మోడీ మరణవార్త చాలా విచారకరం, హృదయ విదారకమైనది. భగవంతుడు ఆ తల్లి ఆత్మను ఆయన పాదాల వద్ద ఉంచి, ప్రియమైనవారికి మద్దతు ఇవ్వాలి. ఈ సమయంలో మోదీకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి!"


సంతాపం వ్యక్తం చేసిన మంత్రి గులాం నబీ ఆజాద్
మాజీ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ తన ట్విట్టర్ ఖాతాలో "ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మరణవార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాను. ఇలాంటి సమయాల్లో మాటలు కొంచెం ఓదార్పునిస్తాయని నాకు తెలుసు. ఏదేమైనా, ప్రధానమంత్రి తల్లి మృతికి నా సంతాపం. హీరాబెన్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను' అని పేర్కొన్నారు.


మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నివాళులర్పించారు. ప్రధాని మోదీ తల్లి మృతి పట్ల మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


పార్థివదేహానికి హర్ష్ సింఘ్వీ నివాళి 
గుజరాత్ హోంమంత్రి హర్ష్ సింఘ్వీ ప్రధాని మోదీ తల్లి భౌతికకాయానికి నివాళులర్పించారు.


గాంధీనగర్‌లోని సెక్టార్ 30లో అంత్యక్రియలు
ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ మృతదేహానికి గాంధీనగర్‌లోని సెక్టార్ 30లోని శ్మశానవాటికలో దహన సంస్కారాలు నిర్వహించనున్నారు. అంతకు ముందు అంతిమ యాత్రను చేపడతారు.