Maharashtra Political Crisis: బలపరీక్షను వాయిదా వేయాలని సుప్రీంలో పిటిషన్- విచారణకు ఓకే చెప్పిన కోర్టు

ABP Desam Updated at: 29 Jun 2022 11:31 AM (IST)
Edited By: Murali Krishna

Maharashtra Political Crisis: మహారాష్ట్ర అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రేను గవర్నర్ ఆదేశించడాన్ని సుప్రీం కోర్టులో శివసేన సవాల్ చేసింది.

బలపరీక్షను వాయిదా వేయాలని సుప్రీంలో పిటిషన్- విచారణకు ఓకే చెప్పిన కోర్టు

NEXT PREV

Maharashtra Political Crisis: గురువారంతో ఎండ్ కార్డ్ పడుతుందనకున్న మహారాష్ట్ర రాజకీయంలో మరో ట్విస్ట్ నెలకొంది. బలనిరూపణ చేసుకోవాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు గవర్నర్ ఆదేశించడాన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేసింది శివసేన. ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని కోరింది.







అనర్హత నోటీసులపై 16 మంది రెబల్ ఎమ్మెల్యేలు ఇంకా సమాధానమే ఇవ్వలేదు. అనర్హతపై తేలకుండానే బలపరీక్షకు సిద్ధమవ్వాలంటూ గవర్నర్ కోరడం చట్ట విరుద్ధం. కనుక బలపరీక్షను వాయిదా వేయాలి.                                                             -    శివసేన పిటిషన్


ఈ మేరకు శివసేన నేత సునీల్ ప్రభు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే బలనిరూపణ ఆదేశాలకు సంబంధించిన డాక్యుమెంట్లు లేకుండా ఎలా విచారణ చేపట్టాలని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. దీంతో సాయంత్రంలోగా అందజేస్తామని శివసేన తరుపు లాయర్లు తెలిపారు. అయితే సాయంత్రం 5 గంటలకు విచారణ చేపడతామని సుప్రీం వెల్లడించింది.


గవర్నర్ ఆదేశాలు


గురువారం సాయంత్రం 5 గంటలకు సభలో మెజారిటీ నిరూపించుకోవాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రేను గవర్నర్ కోరారు. ఈ అసెంబ్లీ సమావేశాన్ని వీడియోలో రికార్డ్ చేయాలని ఆదేశించారు. శివసేన పార్టీలో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో అసెంబ్లీలో బలపరీక్ష అనివార్యమైంది.



రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు తీవ్రంగా కలవరపెడుతున్నాయి. 39 మంది ఎమ్మెల్యేలు మహారాష్ట్ర వికాస్ అఘాడి (ఎమ్‌వీఏ) ప్రభుత్వం నుంచి వైదొలగాలని చూశారు. ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు ఈమెయిల్ ద్వారా లేఖ పంపారు. ప్రతిపక్ష నాయకుడు కూడా నన్ను కలిశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని నాకు వివరించి, బలపరీక్ష కోసం అడిగారు.                                               "
-భగత్ సింగ్ కోష్యారి, మహారాష్ట్ర గవర్నర్



Also Read: Maharashtra Political Crisis: క్లైమాక్స్ చేరిన మరాఠా రాజకీయం- అసెంబ్లీలో గురువారమే బలపరీక్ష


Also Read: Maharashtra Political Crisis: 'ప్లీజ్ వచ్చేయండి, మీ అన్నగా చెబుతున్నా'- రెబల్ ఎమ్మెల్యేలకు ఠాక్రే ఎమోషనల్ లెటర్

Published at: 29 Jun 2022 11:28 AM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.