Maharashtra Political Crisis: 'ప్లీజ్ వచ్చేయండి, మీ అన్నగా చెబుతున్నా'- రెబల్ ఎమ్మెల్యేలకు ఠాక్రే ఎమోషనల్ లెటర్

ABP Desam   |  Murali Krishna   |  28 Jun 2022 04:48 PM (IST)

Maharashtra Political Crisis: శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఓ బహిరంగ లేఖ రాశారు.

(Image Source: PTI)

Maharashtra Political Crisis: మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే.. ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలకు భావోద్వేగపూరితమైన ఓ లేఖ రాశారు. ఎమ్మెల్యేలు అందరూ వెంటనే ముంబయికి తిరిగి రావాలని కోరారు. రెబల్ క్యాంప్ పట్ల తాను కొన్ని రోజులుగా ఆవేదనగా ఉన్నట్లు పేర్కొన్నారు. 

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా వెనక్కి తిరిగి రండి. ఒక కుటుంబ పెద్దగా రెంబల్ క్యాంప్ పట్ల నేను చాలా ఆవేదన చెందుతున్నాను. మీరంతా కొద్ది రోజులుగా గువాహటి హోటల్‌లో చిక్కుకుపోయారు. మీలో చాలా మందితో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాం. మనస్ఫూర్తిగా మీరంతా శివసైనికులే. మీ కుటుంబ సభ్యులు కొందరు నన్ను సంప్రదిస్తున్నారు. మీ గురించి వాళ్లు ఆందోళన చెందుతున్నారు. శివసేన కుటుంబ పెద్దగా మీ అందరి మనోభావాల పట్ల నాకు గౌరవం ఉంది. మీరు వెంటనే ముంబయి రండి. చర్చలతోనే సమస్య పరిష్కారమవుతుంది.                                                              -       ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర సీఎం

ముంబయికి

మరోవైపు 50 మంది ఎమ్మెల్యేలతో ముంబయి వస్తున్నట్లు శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్‌ షిండే ప్రకటించారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన తర్వాత తొలిసారి ఆయన మీడియాతో మాట్లాడారు.

బాలాసాహెబ్ వార‌స‌త్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం. నాతో పాటు 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మాదే నిజమైన శివసేన. త్వ‌ర‌లోనే ముంబయి వెళ్తున్నాం. మా అధికార ప్ర‌తినిధిగా దీప‌క్ కేసార్క‌ర్‌ను నియ‌మించాం. ఆయ‌నే అన్ని విష‌యాల‌ను వివ‌రిస్తారు.                                                                       "

-    ఏక్‌నాథ్‌ షిండే, శివసేన రెబల్ నేత

Also Read: Maharashtra Political Crisis: 'మాదే అసలైన శివసేన'- 50 మంది ఎమ్మెల్యేలతో ముంబయికి షిండే!

Also Read: Satyapal Malik On Agnipath Scheme: 'అగ్నివీరులకు పెళ్లి ఎలా అవుతుంది, పిల్లను ఎవరిస్తారు?- కాస్త చెప్పండి మోదీజీ'

Published at: 28 Jun 2022 04:42 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.