Suspicious Cylinder In J&K: జమ్ముకశ్మీర్‌లో ఓ అనుమానాస్పద సిలిండర్‌ను గుర్తించారు భద్రతా సిబ్బంది. జమ్ము డివిజన్‌లోని అఖ్నూర్ సెక్టార్‌లో ఈ అనుమానాస్పద సిలిండర్‌ లభ్యమైంది. దీంతో బాంబు స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు.


అనంతరం దాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించి ధ్వంసం చేశారు. ఈ సిలిండర్‌ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై బలగాలు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఉగ్ర కుట్ర


గురువారం ఉదయం దోమన అసెంబ్లీ నియోజకవర్గం కానా చక్క్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పరాగ్వల్‌ రోడ్‌ సమీపంలో ఈ సిలిండర్‌ను స్వాధీనం చేసుకున్నారు. సిలిండర్‌ను గుర్తించిన ప్రదేశానికి కేవలం వంద మీటర్ల దూరంలో ఆర్మీ యూనిట్‌ ఉంది.






సమాచారం అందుకున్న వెంటనే ఆర్మీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు, బాంబ్‌ డిస్పోజల్‌ స్క్వాడ్‌ను సంఘటనా స్థలానికి తరలించారు.


కొద్దిసేపు భద్రతా బలగాలు రోడ్డును మూసివేశాయి. ఇదే సమయంలో రాకపోకలను సైతం నిలిపివేశారు. ఆ తర్వాత సురక్షిత ప్రాంతానికి తరలించి సిలిండర్‌ను జేసీబీ సహాయంతో గుంత తీసి, అందులో వేసి ధ్వంసం చేశారు. సిలిండర్‌ను ధ్వంసం చేయడంతో భద్రతా సిబ్బంది, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ సిలిండర్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై పోలీసులు, బలగాలు దర్యాప్తు చేస్తున్నాయి.


మోదీ టార్గెట్‌గా


మరో వైపు ప్రధాని నరేంద్ర మోదీ టార్గెట్‌గా పన్నిన ఉగ్ర కుట్రను పోలీసులు ఛేదించారు. ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను బిహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 12న ప్రధాని మోదీ బిహార్ పర్యటనలో దాడి చేసేందుకు ఉగ్రవాదులు ఈ ప్లాన్ వేసినట్లు పోలీసులు తెలిపారు.


ప్ర‌ధాని మోదీ ల‌క్ష్యంగా ఈ నెల 6,7 తేదీల్లో స‌మావేశ‌మై వీరు ఉగ్ర కుట్ర‌కు ప్రణాళికలు రచించినట్లు పోలీసుల తెలిపారు. అనుమానిత ఉగ్ర‌వాదుల పుల్వారి ష‌రీఫ్ కార్యాల‌యంపై బిహార్ పోలీసులు దాడులు నిర్వ‌హించ‌గా ప‌లు ప‌త్రాలు, ఉగ్ర సాహిత్యాన్ని సీజ్ చేశారు.


Also Read: Dalai Lama J&K Visit: కీలక సమయంలో జమ్ముకశ్మీర్‌లో దలై లామా పర్యటన!


Also Read: Amarnath Yatra Suspended: అమర్‌నాథ్ యాత్రకు మళ్లీ బ్రేకులు- ఇదే కారణం!