మధ్యప్రదేశ్​ భింద్​ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సును లారీ​ ఢీకొట్టిన ఘటనలో ఓ మహిళ సహా మొత్తం ఏడుగురు మృతి చెందారు.  15 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు భింద్ ఎస్పీ మనోజ్ సింగ్ తెలిపారు.






ఎలా జరిగింది?  


గ్వాలియర్ నుంచి బరేలీకి వెళ్తున్న బస్సు..  భింద్​ జిల్లా గోహాడ్​లోని 719వ జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.