Bhupendra Patel Gujarat CM: గుజరాత్‌ సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణం- మోదీ సహా 20 మంది సీఎంలు హాజరు

Advertisement
ABP Desam   |  Edited By: Murali Krishna Updated at: 12 Dec 2022 03:40 PM (IST)

Gujarat CM Oath-Taking: గుజరాత్ సీఎం ప్రమాణస్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

(Image Source: ANI)

NEXT PREV

Gujarat CM Oath-Taking: గుజరాత్ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ సహా  భాజపా పాలిత రాష్ట్రాల నుంచి కనీసం 20 మంది ముఖ్యమంత్రులు హాజరయ్యారు. భూపేంద్ర పటేల్ వరుసగా రెండవసారి ముఖ్యమంత్రిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సహా పలువురు కేంద్రమంత్రులు కూడా హాజరయ్యారు.

Continues below advertisement






ఎక్కడ?


గాంధీనగర్‌లోని కొత్త సెక్రటేరియట్ కాంప్లెక్స్‌లోని హెలిప్యాడ్ గ్రౌండ్‌లో ఈ కార్యక్రమం జరిగింది. గుజరాత్ 18వ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్‌తో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో కొత్త మంత్రి మండలి కూడా ప్రమాణ స్వీకారం చేసింది.


భారీ ఏర్పాట్లు


ఈ కార్యక్రమానికి భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు 10-15 మంది కేంద్ర మంత్రులు హాజరైనట్లు తెలుస్తోంది. హెలిప్యాడ్ మైదానంలో 20,000 మంది సామర్థ్యంతో తాత్కాలిక భవనాన్ని నిర్మించి ప్రమాణ స్వీకారోత్సవ సన్నాహాలను ఐఏఎస్ అధికారుల కమిటీ పర్యవేక్షించింది.






గుజరాత్ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ అహ్మదాబాద్ చేరుకున్నారు.



భాజపాకు అద్భుతమైన మద్దతు ఇచ్చినందుకు గుజరాత్ ప్రజలకు నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గుజరాత్ చరిత్ర సృష్టించింది. ఇంతటి విజయం కోసం పని చేసిన కార్యకర్తలు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.                                                      -        సోనోవాల్, కేంద్ర మంత్రి






ప్రమాణస్వీకార కార్యక్రమానికి తాలూకా, నగర స్థాయిల నుంచి పార్టీ ఆఫీస్ బేరర్లు హాజరయ్యారు. పార్టీకి చెందిన సిట్టింగ్‌, గత ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ మోర్చాల ఆఫీస్‌ బేరర్లు, APMCల చైర్మన్‌/వైస్‌ చైర్మన్లు, డైరెక్టర్లు, గ్రామపంచాయతీ సర్పంచ్‌లు, జన్‌సంఘ్‌ మాజీలు కూడా పాల్గొన్నారు. 


అహ్మదాబాద్‌లోని ఘట్లోడియా నియోజకవర్గం నుంచి 1.92 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందిన తర్వాత ఎన్నికైన ఎమ్మెల్యేలు పటేల్‌ను భాజపా పార్లమెంటరీ పార్టీ అధినేతగా ఎన్నుకున్నారు.


బంపర్ విన్


ఇటీవల ముగిసిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 182 స్థానాలకు గానూ 156 స్థానాలను భాజపా గెలుచుకుంది. ఈ అఖండ విజయంతో గుజరాత్‌లో భాజపా తన జైత్రయాత్రను కొనసాగించింది. రాష్ట్ర శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ 17 సీట్లు, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఐదు స్థానాలను గెలుచుకుంది.


Also Read: UP Crime News: టూర్ కు తీసుకెళ్లి మరీ విద్యార్థనిపై అత్యాచారం - చేసింది సర్కారు బడి ప్రధానోపాధ్యాయుడే!

Published at: 12 Dec 2022 10:22 AM (IST)
Continues below advertisement
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.