PM Modi in Lok Sabha: 'వచ్చే 100 ఏళ్లు అధికారం మాదే.. కాంగ్రెస్‌కు ఇంకా అహంకారం పోలేదు'

ABP Desam Updated at: 07 Feb 2022 07:16 PM (IST)
Edited By: Murali Krishna

లోక్‌సభలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ.. కాంగ్రెస్‌కు చురకలు అంటించారు. రాబోయే 100 ఏళ్లు కూడా అధికారంలో తామే ఉంటామన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ

NEXT PREV

ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు లోక్‌సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సహా విపక్షాలపై మోదీ విమర్శనాస్త్రాలు సంధించారు. అలానే కరోనా కారణంగా దేశం ఎదుర్కొంటోన్న సంక్షోభం గురించి ప్రస్తావించారు.



కరోనా సంక్షోభంలో భారత్ ఓ లీడర్‌గా వ్యవహరించింది. ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించేందుకు భారత్ సిద్ధంగా ఉండాలి. కానీ దేశంలో విపక్షాలు మాత్రం సర్కార్‌ను నిందించడమే పనిగా పెట్టుకుంది. ఈరోజు పేద ప్రజలకు గ్యాస్ కనెక్షన్ దొరుకుతుంది. ప్రభుత్వం ఇళ్లు, మరుగుదొడ్లు కట్టిస్తోంది. వారికంటూ బ్యాంకు ఖాతా ఉంది. కానీ కొంతమంది (ప్రతిపక్షం) బుర్ర మాత్రం 2014 వద్దే ఉండిపోయింది.                                            -  ప్రధాని నరేంద్ర మోదీ


కాంగ్రెస్‌పై సెటైర్లు..


ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు సంధించారు. అనేక రాష్ట్రాలు కాంగ్రెస్​ను గద్దె దించాయని, చాలా రాష్ట్రాల్లో హస్తం పార్టీ అధికారం చెలాయించి ఏళ్లు గడిచిపోతున్నాయని ఎద్దేవా చేశారు. 




కాంగ్రెస్‌కు 24 ఏళ్ల క్రితం నాగాలాండ్ ప్రజలు ఓటేసి అధికాారం ఇచ్చారు. 27 ఏళ్ల క్రితం ఒడిశా ప్రజలు అవకాశం ఇచ్చారు. గోవాలో కాంగ్రెస్ పూర్తి మెజార్టీ సాధించి 28 ఏళ్లు గడిచిపోయాయి. 1988లో త్రిపురలో కాంగ్రెస్ గెలిచింది. 1972లో బంగాల్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి మీరు క్రెడిట్ తీసుకుందామనుకున్నారు కానీ అక్కడి ప్రజలు మిమ్మల్ని అంగీకరించలేదు. ఇన్ని ఎన్నికల్లో ఓటమిపాలైనా కూడా ఇప్పటికీ కాంగ్రెస్‌కు అహంకారం తగ్గలేదు.                                                   -  ప్రధాని నరేంద్ర మోదీ


వందేళ్లు మాదే..







మీరు నన్ను వ్యతిరేకించవచ్చు. కానీ ఫిట్ ఇండియా పథకాన్ని, ఇతర పథకాలను మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? వోకల్ ఫర్ లోకల్ గురించి మాట్లాడినప్పుడు మీరు నన్ను విస్మరిస్తారు. మోదీ చెప్పారు కాబట్టి ఆ పదాన్నే పలకకూడదని మీరు అనుకుంటారు. స్వదేశీ వస్తువులను ఉపయోగించాలని మహాత్మా గాంధీనే స్వయంగా చెప్పారు. వందేళ్ల వరకు అధికారంలోకి రాకూడదని మీరు నిర్ణయించుకున్నట్లు అనిపిస్తోంది. కాబట్టి.. మేం కూడా అందుకు సిద్ధంగా ఉంటాం.                                                       - ప్రధాని నరేంద్ర మోదీ


Also Read: UP Election 2022: 'ఓవైసీపై దాడి ట్రైలర్ మాత్రమే.. సీఎం యోగి కాన్వాయ్‌ను పేల్చేస్తాం'


Also Read: Global Leader Approval Rating: మళ్లీ అయ్యగారే నం.1.. మరెవురివల్లా కాలేదు.. ప్రపంచవ్యాప్తంగా మోదీ క్రేజ్

Published at: 07 Feb 2022 07:09 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.