Subramanian Swamy Comments: 'మోదీ మత్తులో మాట్లాడుతున్నారు'- BJP మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

ABP Desam Updated at: 04 Aug 2022 12:47 PM (IST)
Edited By: Murali Krishna

Subramanian Swamy Comments: మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, అటల్ బిహారీ వాజ్‌పేయీ, ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు భాజపా మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి.

మోదీపై సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు

NEXT PREV

Subramanian Swamy Comments: కేంద్రమాజీ మంత్రి, భాజపా మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేశారు. భారత భూభాగమైన లద్దాఖ్‌లోని కొంత ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుందని ఆరోపించారు.







భారత భూభాగాన్ని చైనా ఆక్రమిస్తోంది. పరస్పర అంగీకారంతో  కుదుర్చుకున్న వాస్తవాధీన రేఖ ఒప్పందాన్ని కూడా చైనా గౌరవించడం లేదు. లద్దాఖ్‌లోని కొంత ప్రాంతాన్ని ఇప్పటికే చైనా ఆక్రమించుకుంది. ఇంత జరుగుతున్నా ప్రధాని మోదీ మాత్రం మన భూభాగంలోకి ఎవరూ రాలేదని మత్తులో ఉన్నట్లుగా మాట్లాడుతున్నారు.                                     - సుబ్రహ్మణ్యస్వామి, భాజపా మాజీ ఎంపీ


మాజీ ప్రధానులపై


మాజీ ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, అటల్ బిహరీ వాజ్‌పేయీలపై కూడా సుబ్రహ్మణ్యస్వామి ఆరోపణలు చేశారు. నెహ్రూ, వాజ్‌పేయీ అవివేకం వల్లే ఈ రోజు టిబెట్, తైవాన్‌లు చైనాలో భాగమయ్యాయని ఆయన ఆరోపించారు. వారి వల్లే మనమంతా దీన్ని అంగీకరించాల్సి వచ్చిందన్నారు. ఈమేరకు ఆయన బుధవారం ట్వీట్ చేశారు.


కీలక సమయంలో


అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటిస్తోన్న సమయంలోనే సుబ్రహ్మణ్యస్వామి ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. పెలోసీ.. తైపీలో అడుగుపెడితే చైనా సైన్యం చూస్తూ ఊరుకోదని డ్రాగన్ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. అయినప్పటికీ పెలోసీ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. టిబెట్‌లో పర్యటించి అమెరికా అండగా ఉందని వారికి హామీ ఇచ్చారు.


Also Read: Vice-Presidential Election 2022: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో NDA అభ్యర్థికే మాయావతి జై


Also Read: Ruchira Kamboj: ఐరాసలో శాశ్వత ప్రతినిధిగా రుచిరా కంబోజ్- మొట్టమొదటి మహిళగా రికార్డ్!

Published at: 03 Aug 2022 02:59 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.