Bengal News: దుర్గామాత నిమజ్జనంలో విషాదం- 8 మంది మృతి!

ABP Desam   |  Murali Krishna   |  06 Oct 2022 11:54 AM (IST)

Mal River Floods: బంగాల్‌లో దుర్గామాత విగ్రహ నిమజ్జనం సందర్భంగా వరదలు సంభవించడంతో 8 మంది మృతి చెందారు.

(Image Source: PTI)

Mal River Floods: బంగాల్‌లో దుర్గామాత విగ్రహ నిమజ్జనంలో విషాదం నెలకొంది. జల్‌పాయ్‌గురి జిల్లాలో విగ్రహ నిమజ్జనం చేస్తుండా వరదలు వచ్చాయి. దీంతో 8 మంది మృతి చెందారు.

ఇదీ జరిగింది

జల్‌పాయ్‌గురి జిల్లాలోని మాల్ నదిలో విగ్రహ నిమజ్జనం సందర్భంగా ఒకేసారి వరదలు వచ్చాయి. ఈ వరదల వల్ల ఎనిమిది మంది వరకు మృతి చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. మరికొందరు కొట్టుకుపోయారు. బుధవారం రాత్రి 8.30 గంటలకు మాల్ నది ఒడ్డున ఈ ఘటన జరిగింది. విజయ దశమి సందర్భంగా విగ్రహ నిమజ్జనంలో పాల్గొనడానికి వందలాది మంది ప్రజలు వచ్చారు.

ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో చాలా మంది కొట్టుకుపోయారు. ఇప్పటివరకు ఎనిమిది మృతదేహాలను వెలికితీశారు. మేము సుమారు 50 మందిని రక్షించాం. రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. NDRF, SDRF, పోలీసు, స్థానిక పరిపాలన బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి.           - మౌమితా గోదారా, జల్‌పాయ్‌గురి జిల్లా మేజిస్ట్రేట్

ప్రధాని సంతాపం

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

జల్‌పాయ్‌గురి ఘటన గురించి తెలిసి షాక్ అయ్యాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. కేంద్రం నుంచి అన్ని విధాలా సాయం అందిస్తాం.                            -     ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బంగాల్ సీఎం మమతా బెనర్జీ, టీఎంసీ నేతలు మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. బంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి.. ప్రభుత్వం సహాయక చర్యలను వేగవంతం చేయాలని కోరారు.

దుర్గామాత నిమజ్జనం సమయంలో మాల్ నదిలో ఆకస్మిక వరద రావడంతో పలువురు కొట్టుకుపోయారు. వెంటనే జిల్లా కలెక్టర్ తక్షణమే రెస్క్యూ ప్రయత్నాలను వేగవంతం చేసి సహాయం అందించాలని అభ్యర్థిస్తున్నాను.                                                             -  సువేందు అధికారి, బంగాల్ ప్రతిపక్ష నేత

Also Read: Kerala School Bus Accident: ఆర్టీసీని ఢీ కొట్టిన స్కూల్‌ విద్యార్థుల బస్సు- ఐదుగురు చిన్నారులు సహా 9 మంది మృతి!

Also Read: Nobel Peace Prize 2022: నోబెల్ శాంతి బహుమతి రేసులో ఇద్దరు భారతీయులు!

Published at: 06 Oct 2022 11:40 AM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.