Kerala School Bus Accident: ఆర్టీసీని ఢీ కొట్టిన స్కూల్‌ విద్యార్థుల బస్సు- ఐదుగురు చిన్నారులు సహా 9 మంది మృతి!

ABP Desam   |  Murali Krishna   |  06 Oct 2022 10:44 AM (IST)

Kerala School Bus Accident: స్కూల్ విద్యార్థులతో విహారయాత్రకు వెళుతోన్న ఓ బస్సు.. ఆర్టీసీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు.

(Image Source: ANI)

Kerala School Bus Accident: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్‌ విద్యార్థుల బస్సు.. ఆర్టీసీని ఢీ కొట్టిన ఘటనలో మొత్తం 9 మంది మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారు.

ట్రిప్ కోసం

పాలక్కాడ్ జిల్లాలోని వడక్కంచెరిలో కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) బస్సును టూరిస్ట్ బస్సు ఢీ కొంది. ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించారు. 38 మంది గాయపడ్డారు. టూరిస్ట్ బస్సులో ఎర్నాకులం జిల్లాలోని బసేలియోస్ విద్యానికేతన్ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారు. టూరిస్ట్ బస్సు ఊటీకి వెళ్తోంది.

ఇలా జరిగింది

టూరిస్టు బస్సు వెనుక నుంచి కేఎస్‌ఆర్‌టీసీ బస్సును ఢీ కొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. బసేలియోస్ విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులతో కూడిన టూరిస్ట్ బస్సు ఎర్నాకులం నుంచి ఊటీకి విహారయాత్ర కోసం వెళుతుంది. KSRTC బస్సు కోయంబత్తూరుకు వెళుతుంది.

మృతుల్లో ఐదుగురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు, కేఎస్‌ఆర్‌టీసీ బస్సులోని ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు. మొత్తం 38 మంది ప్రయాణికులను ఆసుపత్రిలో చేర్చారు. 

ఎర్నాకులం నుంచి ఊటీ వెళ్తోన్న ఓ టూరిస్ట్ బస్సు.. పాలక్కాడ్ వడక్కంచెరిలో హైవేపైన ఉన్న కేఎస్‌ఆర్‌టీసీ బస్సును వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో మొత్తం 9 మంది మృతి చెందారు. ఐదుగురికి తీవ్ర గాయలయ్యాయి. 40 మందికి సాధారణ గాయలయ్యాయి. వీరంతా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నారు.                                                 - ఎమ్‌బీ రాజేశ్, కేరళ రవాణా మంత్రి

Also Read: Nobel Peace Prize 2022: నోబెల్ శాంతి బహుమతి రేసులో ఇద్దరు భారతీయులు!

Also Read: Amit Shah Jammu Kashmir Visit: 'మాటల్లేవ్, మాట్లాడుకోవడాల్లేవ్'- పాక్‌తో చర్చలపై అమిత్ షా

Published at: 06 Oct 2022 10:27 AM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.