Owaisi Vehicle Attacked: ఏఐఎమ్ఐఎమ్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కారుపై కాల్పులు

ABP Desam Updated at: 03 Feb 2022 07:49 PM (IST)
Edited By: Murali Krishna

ఎమ్ఐఎమ్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ వాహనంపై దాడి జరిగింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కారుపై కాల్పులు జరిపారు.

ఓవైసీ వాహనంపై కాల్పులు

NEXT PREV

ఏఐఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ వాహనంపై కాల్పులు జరిగాయి. ఛజర్సీ టోల్ ప్లాజా వద్ద ఆయన కారుపై 3-4 రౌండ్లు బుల్లెట్ల కాల్పులు జరిపారు.







యూపీ మేరట్‌లోని కిథౌర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొని నేను దిల్లీకి వెళ్తోన్న సమయంలో నా వాహనంపై 3-4 రౌండ్ల కాల్పులు జరిపారు. మొత్తం నలుగురు వ్యక్తులు గుంపుగా వచ్చారు. ఇద్దరు కాల్పులు చేశారు. నా వాహనం టైర్లు పంక్చర్ అయ్యాయి. దీంతో నేను మరో వాహనంలో వెళ్లిపోయాను.                                                     - అసదుద్దీన్ ఓవైసీ, ఏఐఎమ్ఐఎమ్ అధినేత






ఉత్తర్‌ప్రదేశ్ మేరట్‌లో ఓ ఎన్నికల ప్రచారంలో పాల్గొని దిల్లీ వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది.


దర్యాప్తునకు విజ్ఞప్తి..


కాల్పుల ఘటనపై ఎన్నికల సంఘం స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని ఓవైసీ విజ్ఞప్తి చేశారు. ఈ దర్యాప్తు చేపట్టాల్సిన బాధ్యత మోదీ, యూపీ ప్రభుత్వాలపై ఉందన్నారు. ఈ విషయంపై లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లాను కూడా కలుస్తానన్నారు. కాల్పులు జరిపిన వారిలో ఒకరిని అరెస్ట్​ చేశామని పోలీసులు తనకు చెప్పినట్లు ఓవైసీ పేర్కొన్నారు. అతని నుంచి పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.


Also Read: Galwan Valley Clash: 'చైనా అబద్ధం చెప్పింది.. గల్వాన్ ఘర్షణలో వారి సైనికుల మరణాలు 9 రెట్లు ఎక్కువ'


Also Read: UP Election 2022: యోగిపై ఈసీకి సమాజ్‌వాదీ ఫిర్యాదు.. సీఎం భాషపై అభ్యంతరం

Published at: 03 Feb 2022 06:14 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.