Arunachal Boy Missing Case: అరుణాచల్‌ ప్రదేశ్ బాలుడ్ని భారత ఆర్మీకి అప్పగించిన చైనా

ABP Desam Updated at: 27 Jan 2022 03:49 PM (IST)
Edited By: Murali Krishna

కొన్ని రోజుల క్రితం తప్పిపోయిన అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన బాలుడ్ని చైనా సైన్యం నేడు భారత్‌కు అప్పగించింది.

అరుణాచల్‌ ప్రదేశ్ బాలుడ్ని భారత ఆర్మీకి అప్పగించిన చైనా

NEXT PREV

అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన బాలుడు మిరాం తరోన్‌ (17)ని చైనా సైన్యం భారత్‌కు అప్పగించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. అధికారిక ప్రక్రియలతో పాటు, వైద్య పరీక్షలు పూర్తైన తర్వాత బాలుడ్ని మన సైన్యానికి చైనా పీఎల్ఏ అప్పజెప్పిందని రిజిజు అన్నారు.








అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన బాలుడు శ్రీ మిరాం తరోన్‌ను చైనా పీఎల్‌ఏ.. భారత సైన్యానికి అప్పగించింది. వైద్య పరీక్షలు సహా అధికారిక ప్రక్రియలన్నీ పూర్తి చేశాం.                                                 - కిరణ్ రిజిజు, కేంద్ర మంత్రి


ఏమైంది?


షియాంగ్ జిల్లాలోని జిడో గ్రామానికి చెందిన ఎస్​హెచ్ మిరాం తరోన్ (17)​.. జనవరి 18న తప్పిపోయాడు. తొలుత యువకుడిని చైనా సైన్యం అపహరించిందని వార్తలు వచ్చాయి. చైనా సైనికుల చెరనుంచి తప్పించుకున్న తరోన్​ స్నేహితుడు.. ఈ విషయాన్ని అధికారులకు చెప్పినట్లు అరుణాచల్ ప్రదేశ్ ఎంపీ తాపిర్ గో కూడా ట్వీట్ చేశారు. 


అయితే, యువకుడు కిడ్నాప్ కాలేదని, తప్పిపోయాడని అధికారులు తర్వాత వివరణ ఇచ్చారు. దీనిపై చైనాతో భారత అధికారులు సంప్రదింపులు జరిపినట్లు కేంద్ర మంత్రి రిజిజు బుధవారం తెలిపారు. యువకుడిని భారత్​కు అప్పజెప్పేందుకు చైనా సైన్యం సానుకూలంగా స్పందించింది. దీంతో ఈరోజు భారత ఆర్మీకి బాలుడ్ని పీఎల్ఏ అప్పగించింది.


Also Read: Covid-19 Update: దేశంలో కొత్తగా 2,86,384 కరోనా కేసులు నమోదు.. 573 మంది మృతి

Published at: 27 Jan 2022 03:45 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.