Afghanistan Crisis: భారత్‌కు తాలిబన్ల లేఖ.. విమాన సర్వీసులు పునరుద్ధరించాలని విజ్ఞప్తి

ABP Desam Updated at: 29 Sep 2021 05:41 PM (IST)
Edited By: Murali Krishna

అఫ్గానిస్థాన్- భారత్ మధ్య కమర్షియల్ విమాన సర్వీసులను పునరుద్ధరించాలని తాలిబన్లు డీజీసీఏకు లేఖ రాశారు.

విమాన సర్వీసులపై తాలిబన్ల లేఖ

NEXT PREV

భారత ప్రభుత్వంతో తాలిబన్ల సర్కార్ సంప్రదింపులు జరిపింది. రెండు దేశాల మధ్య కమర్షియల్‌ విమాన సర్వీసులను పునరుద్ధరించాలని కోరింది. ఈ మేరకు అఫ్గాన్‌ పౌరవిమానయాన శాఖ లేఖ.. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్(డీజీసీఏ)కు లేఖ రాసింది. తాలిబన్ల సర్కార్.. భారత్‌తో అధికారిక సంప్రదింపులు జరపడం ఇదే తొలిసారి. ఈ లేఖను భారత పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ సమీక్షిస్తున్నట్లు సమాచారం.

  







అమెరికా సేనలు.. అఫ్గాన్‌ నుంచి వెనక్కి వెళ్తున్న సమయంలో కాబూల్‌ ఎయిర్‌పోర్టు ధ్వంసమైంది. ఆ విమానాశ్రయాన్ని పునరుద్ధరించాం. ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలు ప్రారంభించే విషయమై ఇప్పటికే విమానయాన సంస్థలకు నోటీసులు పంపాం. భారత్‌, అఫ్గాన్‌ మధ్య తిరిగి ప్రయాణికుల రాకపోకలు జరగాలని కోరుకుంటున్నాం. కనుక కమర్షియల్‌ విమానాల సేవలను పునరుద్ధరించాలని కోరుతున్నాం.                                - తాలిబన్లు


విమానాశ్రయం భద్రతపై పూర్తి భరోసా ఇస్తున్నామని తాలిబన్లు అన్నారు. ఆర్థిక సంకోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని గట్టేక్కించేందుకు తాలిబన్లు ముమ్మర చర్యలు చేపట్టారు. గతవారం కూడా పలు దేశాలతో విమానయన సేవలను పునరద్ధరించాలని తాలిబన్లు విజ్ఞప్తి చేశారు. 


Also Read: BSP MLA : పద్దతిగా లంచాలు తీసుకోవాలని ఉద్యోగులకు ఎమ్మెల్యే పాఠాలు ! ఇంకా నయం వాటాలు అడగలేదని సెటైర్లు !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 29 Sep 2021 05:27 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.