ఏటీఎంను దొంగిలించాలంటే అంత ఈజీ కాదు. సాధారణ సుత్తి, గొడ్డలి వంటి సాధారణ పనిముట్లతో ఏటీఎంను పెకిళించడం సాధ్యం కాదు. అందుకే, దొంగలకు ఓ ఐడియా వచ్చింది. ఏకంగా జేసీబీ ఎక్స్కవేటర్ తీసుకొచ్చి మరీ ఏటీఎంను పూర్తిగా పెకళించి మరీ తమ వెంట తీసుకెళ్లిపోయారు. కానీ, వారిని బ్యాడ్లక్ మరో రూపంలో పలకరించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఈ ఘటన ఎక్కడో విదేశాల్లో జరిగిందని అనుకుంటే పొరపాటే. ఇది జరిగింది ఇండియాలోనే. మహారాష్ట్రలోని సంగ్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. మీరజ్ ప్రాంతంలోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం మీద దొంగల ముఠా కన్నుపడింది. ఒట్టి చేతులతో ఏటీఎంను ఎత్తుకెళ్లడం తీసుకెళ్లడం కష్టమని భావించిన దొంగల ముఠా.. ఓ జేసీబీని తెచ్చుకుంది. ఏటీఎం రూమ్ను తలుపులు పగలగొట్టి మరీ ఏటీఎం మెషిన్ను పెకిళించారు. దాన్ని పట్టుకుని పారిపోతున్న సమయంలో జేసీబీ ఓ గుంతలో ఇరుక్కుంది. దీంతో దొంగలు ఆ ఏటీఎం యంత్రాన్ని మోయలేక.. జేసీబీతోనే వదిలేసి పరారయ్యారు. దోపిడీ సమయంలో ఆ ఏటీఎంలో సుమారు రూ.27 లక్షల నగదు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: ఫోన్ మాట్లాడుతూ లోకం మరిచింది, రెప్పపాటులో ప్రమాదం - ఇదిగో వీడియో
ఈ ఘటనపై మిరాజ్ గ్రామిణ్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ మాట్లాడుతూ.. ‘‘పెట్రోల్ బంక్ వద్ద నిలిపివున్న ఓ జేసీబీని దొంగిలించి దొంగలు ఏటీఎంను పెకిళించారు. ఘటనా స్థలికి కొద్ది దూరంలో జేసీబీ ఓ గుంతలో ఇరుక్కుంది. అందులో ఏటీఎం కూడా సేఫ్గా ఉంది. పెట్రోల్ బంక్ వద్ద ఉన్న సీసీటీవీ ఫూటేజ్లు పరిశీలిస్తున్నాం. త్వరలోనే ఆ దొంగలను అదుపులోకి తీసుకుంటాం’’ అని తెలిపారు. ఈ వైరల్ వీడియో చూసి నెటిజనులు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘మనీ హీస్ట్ 2023’ అని అంటున్నారు.
Also Read: జాగ్రత్త, అంగస్తంభన కోసం ఇలా చేస్తే కళ్లు పోతాయ్! తాజా అధ్యయనం వెల్లడి
వీడియో: