మ్యాగీ మిల్క్ షేక్, ఒరియో బిస్కెట్‌తో పకోడీ, గుడ్డుతో పాప్ కార్న్... ఇలా ఎన్నో వెరైటీ వంటలు గతేడాది అరాచకం సృష్టించాయి. కొత్త ఏడాది వచ్చాక ఇంకా ఈ అరాచకాలు మొదలవ్వలేదేంటా అనుకుంటున్నారా? ఇదిగో అప్పుడే ఈ వెగటు పుట్టించే వంటకం వైరల్ అయిపోతోంది. పానీపూరీ అభిమానులు ఈ వంటకాన్ని చూసి ఎలా ఫీలవుతారో మరి. 


అసలే దేశవ్యాప్తంగా పానీపూరీకి వీరాభిమానులున్నారు. రోజుకోసారైనా దాన్ని తినకపోతే ఏదో వెలితిలా ఫీలయిపోతుంటారు. ఇక ఐస్ క్రీమ్ కూడా అందరి హాట్ ఫేవరేట్. వేసవి వస్తే వాటి అమ్మకాలు మామూలుగా ఉండవు. ఈ రెండూ కలిపి ఓ కొత్త వంటకాన్ని సృష్టిస్తే ఎలా ఉంటుంది? అదే జరిగిందిప్పుడు. పానీపూరీని గరిటెతో పచ్చడిలా చేసి ఐస్ క్రీమ్ వేసి దాన్ని రోల్స్‌లా చేసి అమ్ముతున్నారు. ఇంకా అరాచకమైన విషయం ఏంటంటే ఈ రోల్స్ పై చట్నీ వేసి సర్వ్ చేస్తున్నారు. ఈ వెరైటీ వంటకం ఎవరు, ఎక్కడ సిద్ధం చేశారో తెలియదు కానీ ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అవుతోంది. ‘ద గ్రేట్ ఇండియన్ ఫుడీ’ అనే బ్లాగర్ ఈ వీడియోను పోస్టు చేశాడు. ఆ అరాచకాన్ని మీరు చూసి ఆనందించండి. 






Also read:  పొట్లకాయ, గుడ్డు కలిపి వండితే విషపూరితం అవుతుందా? ఇందులో నిజమెంత?


Also read:  బాహుబలిని మించేలా ఐరన్ మ్యాన్ థాలి... తింటే రూ.8.50 లక్షలు మీ సొంతం