National Cancer Awareness Day 2023 : ప్రతి సంవత్సరం భారతదేశంలో 1.1 మిలియన్ల కొత్త క్యాన్సర్​ కేసులు నమోదవుతున్నాయి. అంతేకాకుండా క్యాన్సర్​ మరణాల రేటులో కూడా మన దేశం ఇప్పటికీ అగ్రగామిగానే ఉందని WHO నివేదిక ఇచ్చింది. మన దేశంలో క్యాన్సర్​పై ఎంతవరకు అవగాహన ఉందో ఈ నివేదికే చెప్తుంది. క్యాన్సర్​ను తగ్గించుకోగలిగే ఆప్షన్లు ఉన్నా సరే.. సరైన అవగాహన లేక చాలామంది ఈ మహమ్మారి​ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ప్రజలకు దీనిపై అవేర్​నెస్​ కల్పించడం చాలా ముఖ్యం. 


క్యాన్సర్​లో రకాలు, దానిని ముందుగా ఎలా గుర్తించాలి.. జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేస్తే.. క్యాన్సర్​కు దూరంగా ఉండొచ్చు.. ఎలాంటి చికిత్సలు తీసుకుంటే దీనిని జయించవచ్చు అనే విషయాలపై అవగాహన కల్పించేందుకు దేశ వ్యాప్తంగా నవంబర్ 7వ తేదీన నేషనల్ క్యాన్సర్​ అవేర్​నెస్​ డేని చేస్తున్నారు. దీనిలో భాగంగా అధికారులు, ఎన్జీవోలు క్యాన్సర్ అవేర్​నెస్​ క్యాంపులు నిర్వహిస్తారు. ఇవి రోగ నిర్ధారణ, తీసుకోవాల్సిన చికిత్సలపై ఫోకస్ పెట్టేందుకు సహాయం చేస్తుంది. 


ఈరోజే ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారంటే..


నోబెల్ బహుమతి గ్రహీత మేడమ్ క్యూరీ జయంతిని పురస్కరించుకుని.. ఈ అవగాహన దినోత్సవం జరుపుకుంటున్నారు. ఆమె నివాళిగానే కాకుండా.. క్యాన్సర్​తో బాధపడే, పోరాడే వారికి తమ సామర్థ్యాన్ని గుర్తు చేస్తుంది. ఆంకాలజీ రంగాన్ని అభివృద్ధి చేయడంలో, క్యాన్సర్​ బాధితుల జీవితాలను మెరుగుపరచడంలో ఇది సాయం చేస్తుంది. 


సోషల్ మీడియా మంచి ప్లాట్​ఫారం


ఒకప్పటితో పోలీస్తే.. వీటిపై అవగాహన కల్పించేందుకు సోషల్​ మీడియా ఓ మంచి ప్రత్యామ్నయంగా చెప్పవచ్చు. చాలామందిలో క్యాన్సర్​ గుర్తించినా.. వైద్యానికయ్యే ఖర్చును భరించలేమని మధ్యలోనే చికిత్స తీసుకోవడం ఆపేస్తారు. మరికొందరు క్యాన్సర్​ లక్షణాలు గుర్తించక.. ఆలస్యం చేస్తారు. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. కాబట్టి సకాలంలో ఆస్పత్రికి వెళ్లడం.. మందులు వాడడం.. ట్రీట్​మెంట్​ తీసుకోవడం వంటి విషయాలు సోషల్​ మీడియాలో పోస్ట్ చేయవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలికోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపే డే గా.. నేషనల్ క్యాన్సర్​ అవేర్​నెస్​ డేని నిర్వహిస్తున్నారు. ఇది క్యాన్సర్​ బారిన పడకుండా.. హెల్తీ లైఫ్​ చేయడానికి అవసరమయ్యే ఓ రిమైండర్​గా చెప్పవచ్చు. 


ఏయే అంశాల గురించి చర్చించాలంటే..


ఈ స్పెషల్​ డే రోజు.. క్యాన్సర్​లోని రకాలు.. వాటికి గల కారణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. మెరుగైన చికిత్సలు.. వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించవచ్చు. మీ వైద్యులు మీకు క్యాన్సర్​ ఉందేమోనన్న అనుమానం వ్యక్తం చేస్తే.. మీరు కొన్ని ముఖ్యమైన పరీక్షలు వైద్యుని సూచనల మేరకు చేయండి. వారు ఇచ్చే మందులను రెగ్యూలర్​గా తీసుకోండి. మానసికంగా మీరు ఎంత స్ట్రాంగ్​గా ఉంటే.. క్యాన్సర్​ నుంచి అంత త్వరగా బయటపడొచ్చు. క్యాన్సర్​ నుంచి బయటపడిన వారు తమ ఎక్స్​పీరియన్స్ షేర్ చేస్తే.. అది ఇంకా బెటర్​గా ప్రజల్లోకి వెళ్తుంది. క్యాన్సర్ సంకేతాలు, లక్షణాలు, రెగ్యూలర్ చెక్​ అప్​ ప్రాముఖ్యతలు తెలియజేయాలి. 


క్యాన్సర్​పై పరిశోధనలు, చికిత్సలకు ప్రజలు మద్ధతునిచ్చేలా అవగాహన పెంచాలి. ఎందుకంటే.. వివిధ వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినప్పుడు చికిత్సల్లో మెరుగైన ఫలితాలు ఉంటాయి. 


Also Read : చలికాలంలో ఈ సింపుల్​ వ్యాయామాలతో మోకాళ్ల నొప్పులు దూరం చేసుకోవచ్చు