ప్రేమికుల మధ్య గొడవలు సహజమే. ఒకరిపై ఒకరి కోపంతో మాట్లాడుకోవడం కూడా మానేస్తారు. ఇద్దరిలో ఎవరో ఒకరు రాజీ పడితేనే.. మళ్లీ ఒక్కటవ్వుతారు. సాధారణంగా ప్రియుడు లేదా ప్రియురాలు మాట్లాడుకోకపోతే.. వారి స్నేహితులో, బంధువులో హెల్ప్ చేస్తారు లేదా హెల్ప్ తీసుకుంటారు. కానీ, ఈ యువతి ఏకంగా పోలీసులకే ఫిర్యాదు చేసింది. ప్రియుడు తనతో మాట్లాడటం లేదు.. సాయం చేయండని అడిగింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 


చింద్వారా ప్రాంతానికి చెందిన యువతి.. సరనీ ప్రాంతానికి చెందిన యువకుడితో ప్రేమలో పడింది. అయితే, ఇటీవల ఆమె తన ప్రియుడి పుట్టిన రోజున విష్ చేయడం మరిచిపోయింది. దీంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. ఏదో పనిలోపడి మరిచిపోయానని, ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని ఆమె చెప్పింది. కానీ, అతడు మాత్రం ఆమె మాట వినలేదు. అన్ని ప్రయత్నాలు ఫెయిల్ కావడంతో.. ఇక పోలీసులే దిక్కు అని అనుకుంది. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ప్రియుడిపై ఫిర్యాదు చేసింది. 


Also Read: సిగ్గు సిగ్గు.. స్టేజ్ మీదే అభిమాని ముఖంపై మూత్రం పోసిన లేడీ సింగర్.. ఆమె స్పందన ఇదీ!


పోలీసులకు ఫోన్ చేసిన ఆమె.. ‘‘నా ప్రియుడు కొద్ది రోజులుగా నాతో మాట్లాడటం లేదు. పుట్టిన రోజున విష్ చేయడం మరిచిపోయానని అలిగాడు. మీరే నాకు సాయం చేయాలి’’ అని అడిగింది. దీంతో పోలీసులు ఆమె రిక్వెస్టును కాదనలేక.. ఆ ప్రేమ జంటను పోలీస్ స్టేషన్‌కు రప్పించుకున్నారు. ఆ తర్వాత ఇద్దరినీ పక్కపక్కన కూర్చోబెట్టి కౌన్సెలింగ్ ఇచ్చారు. చివరిగా.. ఇలా ప్రేమికులుగా పోట్లాడుకోకుండా.. పెళ్లి చేసుకుని కలిసి జీవించండి అని వారికి హితవు చెప్పారు. అంతేకాదు.. వీరి ప్రేమను వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వారు కూడా అంగీకరించడంతో.. ఆలస్యం చేయకుండా ఆర్య సమాజ్ మందిరంలో ఇద్దరికీ పెళ్లి చేసేశారు. చూశారా.. ఈ సీన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందో!


Also Read: సిగ్గు సిగ్గు.. స్టేజ్ మీదే అభిమాని ముఖంపై మూత్రం పోసిన లేడీ సింగర్


Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!


Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..


Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి