భారతీయులు చాలా మంది స్పైసీ ఫుడ్ లేకుండా తమ భోజనాన్ని ముగించరు. తప్పకుండా వారి మెనూలో కచ్చితంగా స్పైసీ వంటకం ఉండాల్సిందే. చివరికి రైతా లో కూడా పచ్చిమిర్చి వేసి స్పైసీ టచ్ ఇస్తారు. కూరల్లో మసాలా దినుసులతో తయారు చేసిన పొడి వేసుకోవడం చేస్తారు. అయితే ఎక్కువగా స్పైసీ ఫుడ్ తినడం వల్ల కడుపులో మంట, ఎసిడిటీ వస్తుందని వాటికి దూరంగా ఉండమని వైద్యులు సూచిస్తారు. కొంతమందికి మాత్రం కారం తగలనిదే తిన్నట్టు అనిపించదు. అయితే ఆయుర్వేదం ప్రకారం రోజు కొద్దిగా స్పైసీ ఫుడ్ తినడం వల్ల ఎటువంటి సమస్యలు ఉండవని నిపుణులు చెప్తున్నారు.


మనం తినే ఆహారం జీర్ణం చెయ్యడంలో స్పైసీ ఫుడ్ పాత్ర ఉంటుందని ఆయుర్వేదం చెప్తుంది. ఊబకాయం, గుండె జబ్బులు, దంత సమస్యలతో పాటు సీజనల్ ఇన్ఫెక్షన్స్ తో పోరాడేందుకు మసాలా దినుసులు అద్భుతంగా పని చేస్తాయి. కానీ కొంతమంది మాత్రం కడుపులో మంట, ఎసిడిటీ, అజీర్ణనానికి భయపడి స్పైసీ ఫుడ్ కి నో చెప్పేస్తారు. తర్వాత అవి తినలేకపోతున్నామే అని ఫీల్ అవుతారు. ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మీకు ఎంతో ఇష్టమైన స్పైసీ ఫుడ్ తీసుకోవచ్చు అలాగే ఎటువంటి ఇబ్బంది మీకు అనిపించదు. మసాలా దినుసులకి బదులుగా నల్ల మిరియాలు, కొద్దిగా ఎర్ర మిరపకాయలు వంటి వాటిని వంటల్లో ఉపయోగించి రుచికరమైన భోజనాన్ని మీరు ఆస్వాదించవచ్చు. వెల్లుల్లి కూడా తీసుకోవచ్చు. ఇది అజీర్ణ సమస్యలను నయం చేస్తుంది.


పెరుగుతో నల్ల మిరియాల పొడి


సుగంధ ద్రవ్యాల ఘాడతను పెరుగు తగ్గిస్తుంది. పెరుగుతో రైతా చేసుకుని అందులో కొద్దిగా ఉప్పు మిరియాల పొడి జోడించుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది తింటే మీకు కడుపులో మంట అనుభూతిని కలిగించదు.


లైకోరైస్ టీ


బొజ్జ నిండా తిన్నా తర్వాత చాలా మందికి కడుపులో మంటగా అనిపిస్తుంది. అది తగ్గాలంటే లైకోరైస్ తో తయారు చేసిన టీ తాగితే ఎటువంటి ఇబ్బంది మీకు ఉండదు. రెండు కప్పుల నీటిలో ఒక లైకోరైస్ రూట్ వేసి బాగా మరిగించాలి. తర్వాత దాన్ని గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగితే అద్భుతంగా ఉంటుంది.


భోజనం మధ్యలో కారంగా ఉండేవి తినాలి


భోజనం మొదలు పెట్టగానే స్పైసీ గా ఉండేవి తీసుకోవడం వల్ల నోరు మంటగా అనిపిస్తుంది. అందుకే భోజనాన్ని ముందుగా తీపితో ప్రారంభించి తర్వాత కొద్దిగా ఉప్పుగా ఉండేవి తినాలి. ఆ తర్వాత మసాలాతో కూడిన పదార్థాలు తీసుకోవాలి. అవి తిన్నా తర్వాత ఛాతీ వాటితో భోజనాన్ని ముగించాలి.


మిరపకాయలు తగ్గించాలి


ఎరుపు లేదా పచ్చి మిర్చికి బదులుగా వెల్లుల్లి, నల్ల మిరియాలు ఉపయోగించండి. ఈ మసాలాలు పొట్టలో తేలికగా ఉంటాయి, సులభంగా జీర్ణం అవుతాయి.  


Also Read: టాయిలెట్‌లో టైంపాస్? గంటలు గంటలు దానిపై కూర్చుంటే చెప్పుకోలేని రోగం వస్తుందట!


Also Read: 30 డేస్ వాటర్ ఛాలెంజ్ - ఈ ట్రెండ్ ఫాలో కావద్దు, ప్రాణాలు పోతాయ్, ఎందుకంటే..