హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్‌) ట్రేడ్ అప్రెంటిస్‌షిప్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 484 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలను  భర్తీ చేయనున్నారు. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు అక్టోబర్‌ 10లోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.


వివరాలు..


* ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు 


ఖాళీల సంఖ్య: 484.


సీట్ల కేటాయింపు: జనరల్-243, ఈడబ్ల్యూఎస్-24, ఓబీసీ-131, ఎస్సీ-73, ఎస్టీ-37.


విభాగాల వారీగా ఖాళీలు..


➥ ఈఎం- 190


➥ ఎలక్ట్రీషియన్- 80


➥ ఫిట్టర్- 80


➥ ఆర్‌ & ఏసీ- 20


➥ టర్నర్- 20


➥ మెషినిస్ట్- 15


➥ మెషినిస్ట్(జి)- 10


➥ సీవోపీఏ- 40


➥ వెల్డర్- 25


➥ పెయింటర్‌- 4


వయోపరిమితి: 31.10.2023 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి


అర్హత: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.


ఎంపిక విధానం: ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.


శిక్షణ కాలం: ఏడాది.


స్టైపెండ్: నెలకు రూ.7,700 నుంచి రూ.8,050.


డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగే వేదిక: 
ELECTRONICS CORPORATION OF INDIA LIMITED,
Corporate Learning & Development Centre (CLDC),
Nalanda Complex, TIFR Road, ECIL,
Hyderabad – 500 062. Phone NO. 04027186454


ముఖ్య తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు, రిజిస్ట్రేషన్ ప్రారంభం: 25.09.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10.10.2023.


➥ ధ్రువపత్రాల పరిశీలన తేదీలు: 16.10.2023 నుంచి 21.10.2023 వరకు.


➥ ప్రవేశానికి గడువు తేదీ: 31.10.2023


➥ అప్రెంటిస్‌షిప్ శిక్షణ ప్రారంభం: 01.11.2023.


Notification


Online Application


Website


ALSO READ:


కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్-2024 నోటిఫికేషన్ వచ్చేసింది, పోస్టుల వివరాలు ఇలా
యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 'కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ ఎగ్జామినేషన్‌-2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా కేంద్ర గనుల శాఖ, జలవనరుల శాఖలో గ్రూప్‌-ఎ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.200 చెల్లించి అక్టోబరు 10లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న ప్రిలిమినరీ పరీక్ష; జూన్ 22న మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


డిగ్రీ అర్హతతో 600 జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్ జాబ్స్, ఏడాదికి రూ.6.50 లక్షల జీతం
ఇండ‌స్ట్రియ‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) బ్యాంకు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 600 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మణిపాల్ (బెంగళూరు), నిట్టే (గ్రేటర్ నోయిడా) విద్యాసంస్థలతో కలిసి పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్‌) కోర్సు ద్వారా ఈ పోస్టుల‌ను ఐడీబీఐ భ‌ర్తీ చేయ‌నుంది. ఎంపికైన‌ వారికి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విభాగంలో ఏడాది శిక్షణ ఉంటుంది. ఇందులో 6 నెలలు క్లాస్‌రూమ్ సెషన్, 2 నెలలు ఇంట‌ర్న్‌షిప్‌, 4 నెలలపాటు ఉద్యోగ శిక్షణ ఉంటుంది. కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్నవారికి పీజీడీబీఎఫ్ సర్టిఫికేట్‌తోపాటు జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్ (గ్రేడ్‌-ఓ) ఉద్యోగం ల‌భిస్తుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..