విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్షల ఆధారంగా ఖాళీలను భర్తీ చేస్తారు. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 7న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబరు 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. నవంబరులో రాతపరీక్ష నిర్వహించనున్నారు.


ఖాళీల వివరాలు..


* స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు


ఖాళీల సంఖ్య: 35 పోస్టులు


అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి. తెలుగు, ఇంగ్లిష్ భాషలు తెలిసి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం.


వయోపరిమితి: 01.10.2023 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.


దరఖాస్తు ఫీజు: జనరల్/ బీసీలకు రూ.700. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎక్స్‌ఎం అభ్యర్థులకు రూ.500.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్/ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా.


జీతం: నెలకు రూ.17,900 నుంచి రూ.47,920.


ముఖ్యమైన తేదీలు...


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.10.2023.


➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 21.102023.


➥ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేది: 21.10.2023.


➥ ఆన్‌లైన్ పరీక్ష తేదీ: నవంబర్, 2023.


Website


                                 


ALSO READ:


కాకినాడ సహకార బ్యాంకులో 33 ఆఫీసర్, క్లర్క్ పోస్టులు - ఈ అర్హతలుండాలి
కాకినాడలోని కాకినాడ కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ పలు శాఖల్లో ఆఫీసర్, క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు, అనుభవం ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా అక్టోబరు 31 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆఫీసర్ క్లర్క్ కమ్ క్యాషియర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.500. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. అదేవిధంగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అసిస్టెంట్ సీఈవో, మేనేజర్ పోస్టులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. అర్హతలు, అనుభవం ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఎస్‌బీఐ స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్ దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 16న ప్రారంభంకాగా.. అక్టోబరు 6 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. అయితే దరఖాస్తు గడువును అక్టోబరు 21 వరకు పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థులు అక్టోబరు 21లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
పీవో పోస్టుల దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..


ఆర్‌బీఐ అసిస్టెంట్ పోస్టుల నియామక పరీక్ష తేదీలు వెల్లడి - ప్రిలిమ్స్, మెయిన్ ఎగ్జామ్స్ ఎప్పుడంటే?
ఆర్‌బీఐలో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న రాత పరీక్షల కొత్త షెడ్యూలును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్టోబరు 6న విడుదల చేసింది. గతంలో పేర్కొన్నవ కాకుండా కొత్త పరీక్ష తేదీలను ఆర్‌బీఐ తాజాగా ప్రకటించింది. తాజా షెడ్యూలు ప్రకారం నవంబర్‌ 18, 19 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు డిసెంబర్‌ 31న ప్రధాన పరీక్ష నిర్వహించనున్నారు. 
పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..