తెలుగు రాష్ట్రాల్లోని జిల్లా, సబార్డినేట్‌ కోర్టుల్లో 219 న్యాయాధికారుల(మెజిస్ట్రేట్) పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్రం రాజ్యసభలో వెల్లడించింది. రాజ్యసభలో బీజేపీ సభ్యుడు సీఎం రమేష్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ ఈ మేరకు సమాధానమిచ్చారు. మొత్తం ఖాళీల్లో ఆంధ్రప్రదేశ్‌లో 74, తెలంగాణలో 145 మెజిస్ట్రేట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయన వెల్లడించారు. రాష్ట్రాల పరిధిలోకి కోర్టుల్లో ఖాళీల భర్తీలో కేంద్ర ప్రభుత్వ పాత్రేమీ ఉండదని.. వాటి నియామక బాధ్యత రాష్ట్ర హైకోర్టులు, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలదేనని మేఘ్‌వాల్‌ తెలిపారు. 


కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉండటానికి కేవలం మెజిస్ట్రేట్ పోస్టులు ఖాళీగా ఉండటం ఒక్కటే కారణం కాదని చెప్పారు. మౌలిక వసతులు, సహాయక సిబ్బంది కొరత లాంటి సంక్లిష్టమైన సమస్యలు దీంతో ముడిపడి ఉంటాయని తెలిపారు. జులై 28వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా, కిందిస్థాయి కోర్టుల్లో 618 మంది న్యాయాధికారులకుగాను 544 మంది పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇదే సమయంలో తెలంగాణలో 560 మందికిగాను 415 మంది సేవలందిస్తున్నట్లు కేంద్ర మంత్రి వివరించారు.


ALSO READ:


ఏపీలో 39 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ, కేంద్రం వెల్లడి
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 8 తరగతుల బోధనకు సంబంధించి 39,008 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో టీచర్ పోస్టుల ఖాళీలపై ఆగస్టు 2న రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి అన్నపూర్ణదేవి ఈ మేరకు సమాధానమిచ్చారు. ఏపీలో 2020-21 విద్యాసంవత్సరంలో 22,609 ఖాళీలు ఉండగా.. 2021-22 విద్యాసంవత్సరం నాటికి 38,191కి చేరాయి. ఇక 2022-23 విద్యాసంవత్సరానికి మొత్తం ఖాళీల సంఖ్య 39,008కి పెరిగినట్లు ఆమె వెల్లడించారు. అంటే రాష్ట్రంలో రెండేళ్లలో ఖాళీలు 16,399 మేర పెరిగాయి. 1,56,895 టీచర్‌ పోస్టులకుగాను ప్రస్తుతం 1,17,887 మంది పనిచేస్తున్నట్లు అన్నపూర్ణదేవి తెలిపారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


తెలంగాణలో 11,348 టీచర్ పోస్టులు ఖాళీ, రాజ్యసభలో కేంద్రం వెల్లడి
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో 11,348 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 97,710 పోస్టులకుగాను 86,362 మంది మాత్రమే పనిచేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి అన్నపూర్ణ దేవి ఆగస్టు 2న రాజ్యసభకు తెలిపారు. ఇక ప్రధానమంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా (పీఎంశ్రీ) పథకం కింద తెలంగాణలో 543 పాఠశాలలను ఎంపిక చేసినట్లు కేంద్ర మంత్రి అన్నపూర్ణ దేవి తెలిపారు. మొత్తం 14,500 పాఠశాలలను బాగు చేయాలన్నది లక్ష్యంగా కాగా తొలిదశలో 27 రాష్ట్రాల్లో 6,207 పాఠశాలలను ఎంపిక చేశామని, అందులో తెలంగాణ నుంచి 543 ఉన్నాయని మంత్రి వివరించారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


యూపీఎస్సీ సివిల్స్‌ మెయిన్స్‌ షెడ్యూలు ఖరారు, పరీక్షలు ఎప్పుడంటే?
సివిల్ సర్వీసెస్‌ మెయిన్స్ పరీక్షల షెడ్యూలును యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వెల్లడించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబర్ 15, 16, 17, 23, 24 తేదీల్లో సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ప్రతిరోజూ రెండు సెష‌న్లలో పరీక్షలు జరుగనున్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పరీక్షలు హైదరాబాద్, విజయవాడ నగరాల్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. సివిల్ సర్వీసెస్ పరీక్షల ద్వారా  మొత్తం 1105 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలకు తుది ఎంపిక చేస్తారు. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 ప్రిలిమ్స్ పరీక్షను మే 28న నిర్వహించగా.. జూన్‌ 12న ఫలితాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...