Coronavirus India Update: కొత్తగా 35 వేల కరోనా కేసులు.. మహారాష్ట్రలో 45 డెల్టా కేసులు

ABP Desam Updated at: 09 Aug 2021 11:40 AM (IST)

దేశంలో కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. కొత్తగా 35,499 కేసులు నమోదుకాగా 447 మంది మరణించారు. రికవరీ రేటు 97.40%గా ఉంది.

దేశంలో కరోనా కేసుల వివరాలు

NEXT PREV

దేశంలో వరుసగా రెండు రోజులు నుంచి కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. కొత్తగా 35,499 కేసులు నమోదవగా 447 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 4,02,188గా ఉంది. రికవరీ రేటు 97.40%కి చేరింది. 






వీక్లీ పాజిటివ్ రేటు 5 శాతానికి తక్కువే ఉంది. ప్రస్తుతం 2.35%గా ఉంది. డైలీ పాజిటివ్ రేటు 2.59%కి చేరింది. గత 14 రోజులుగా డైలీ పాజిటివ్ రేటు 3 శాతానికి తక్కువే ఉంది.


మొత్తం మరణాల సంఖ్య 4,28,309కి చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.


కేరళలో మాస్ వ్యాక్సినేషన్..


కేరళలో కొత్తగా 18,607 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 35,52,525కి చేరింది. కొత్తగా 93 మంది మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 17,747కి పెరిగింది.


తాజాగా 1,34,196 మందికి పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్ రేటు (టీపీఆర్) 13.87 శాతంగా ఉంది.


20,108 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 33,57,687కి పెరిగింది.


మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,76,572కి పెరిగింది.


కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మాస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టింది ప్రభుత్వం. ఆగస్టు 31 వరకు ఈ కార్యక్రమం జరగనుంది. వీలైనంత మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.



 రాష్ట్ర ప్రభుత్వానికి అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ డోసులతో పాటు మరిన్ని కావాలి. ప్రైవేట్ సెక్టార్ కు కూడా వ్యాక్సిన్ లు అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వం 20 లక్షల వ్యాక్సిన్ డోసులను కొనుగోలు చేసి ప్రైవేట్ ఆసుపత్రులకు అదే ధరకు ఇస్తాం. వీలైనంత త్వరగా ప్రజలకు వ్యాక్సినేషన్ అయ్యేలా చర్యలు చేపడతాం. ఈ ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అవసరమైన సదుపాయాలను ప్రైవేట్ ఆసుపత్రులు ఏర్పాటు చేసుకోవాలి. తక్కువ సమయంలో ఎంతమందికి వీలైతే అంతమందికి వ్యాక్సిన్ వేయడమే మా లక్ష్యం.                          - పినరయి విజయన్, కేరళ ముఖ్యమంత్రి

మహారాష్ట్రలో 45 డెల్టా కేసులు..


ఆగస్టు 8 వరకు మహారాష్ట్రలో 45 డెల్టా వేరియంట్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 5,508 కరోనా కేసులు నమోదుకాగా 151 మంది మరణించారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 63,53,327కి చేరగా మృతుల సంఖ్య 1,33,996 వద్ద ఉంది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.


4,895 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 61,44,388కి పెరిగింది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 71,510 వద్ద ఉంది.


రికవరీ రేటు 96.71%గా ఉంది. మరణాల రేటు 2.1%.గా ఉంది.

Published at: 09 Aug 2021 11:38 AM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.