ఏదో ఒక రూపంలో చేపలను ఆహారంలో వారంలో కనీసం 2 లేదా 3 సార్లు తీసుకుంటే అనేక అద్భుతమైన లాభాం అని వైద్యులు చెబుతున్నారు. అవేమిటో ఇప్పుడు చూద్దాం. 


Also Read: Bottle Feeding: మీ చిన్నారికి డబ్బాతో పాలు పడుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?


* చేపలను తరచూ తినడం వల్ల వాటిల్లో ఉండే డోపమైన్, సెరొటోనిన్ అనే హార్మోన్లు డిప్రెషన్‌ను తగ్గిస్తాయట. నిత్యం ఎదురయ్యే ఒత్తిడి, మానసిక ఆందోళన తగ్గుతాయని సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడైంది.


* వయస్సు మీద పడడం వల్ల ఎవరికైనా సహజంగానే మతిమరుపు వస్తుంది. కొందరికి ఇది తీవ్రతరమై అల్జీమర్స్‌కు దారి తీస్తుంది. అలాంటి సమస్య ఉన్నవారు చేపలను తినడం వల్ల ఆ సమస్య నుంచి బయట పడొచ్చని అమెరికన్ సైంటిస్టులు చేపట్టిన పరిశోధనలో తేలింది. చేపలను తినడం వల్ల మెదడు బాగా పనిచేస్తుందట. జ్ఞాపకశక్తి పెరుగుతుందని వారు చెబుతున్నారు.


Also Read: Jasmine Benefits: తలనొప్పితో బాధపడుతున్నారా? మల్లెపూలను పక్కన పెట్టుకుని నిద్రపోండి


* చేపలను తరచుగా తీసుకోవడం మూలంగా, మీ దృష్టిని మెరుగుపరచడానికి మరియు దృష్టి సంబంధిత సమస్యలు తలెత్తకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.


* చేపలను బాగా తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు రక్తంలో ఉండే ట్రై గ్లిజరైడ్లను తగ్గిస్తాయి. దీంతో రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.


* చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. అలాగే పెద్ద పేగు, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, పాంక్రియాటిక్ క్యాన్సర్ తదితర క్యాన్సర్లు రాకుండా నిరోధిస్తాయట. 


Also Read: Corona: కరోనా నుంచి కోలుకున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి


* ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గించడంలో చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు గణనీయమైన పాత్రను పోషిస్తాయి. చేపల్లో విటమిన్ ఇ ఉండటం కూడా ఇందుకు మరొక కారణంగా చెప్పబడుతుంది.


* స్త్రీలలో రుతు క్రమం సరిగ్గా ఉండాలన్నా... ఆ సమయంలో ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్నా... తరచూ చేపలను తినాలని వైద్యులు సూచిస్తున్నారు.


Also Read: Cancers: వారానికి 150 నిమిషాలు వ్యాయామం చేస్తే... క్యాన్సర్ల ముప్పు నుంచి కాస్త తప్పించుకోవచ్చు


Also Read: Eyesight: గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుంటున్నారా? కళ్లు దెబ్బ తింటాయని భయపడుతున్నారా? అయితే మీ కోసమే ఈ చిట్కాలు