టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో 'వారియర్' అనే సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వచ్చే నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కృతిశెట్టి హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమా తరువాత బోయపాటి దర్శకత్వంలో సినిమా చేయనున్నారు రామ్. 


దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మించనున్నారు. ఆగస్టులో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఈ సినిమాలో హీరోయిన్స్ ను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. కథ ప్రకారం.. ఇద్దరు హీరోయిన్లు కనిపించబోతున్నారు. 


ఒక హీరోయిన్ ను బాలీవుడ్ నుంచి దిగుమతి చేయబోతున్నారు. టాలీవుడ్ నుంచి మరో హీరోయిన్ ను తీసుకోబోతున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయనున్నారు. రామ్ సినిమాలు హిందీలో డబ్ లో యూట్యూబ్ లో మిలియన్స్ లో వ్యూస్ ను సాధించాయి. ఆ విధంగా బాలీవుడ్ ఆడియన్స్ కి దగ్గరయ్యారు. తొలిసారి ఆయన ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా ఎంటర్ అవ్వబోతున్నారు. మరి ఈ సినిమాతో రామ్ మాస్ హిట్ అందుకుంటారేమో చూడాలి!


Also Read: 'సాయిపల్లవి మైండ్ పాడైంది, ఏది పడితే అది మాట్లాడితే సహించం' బీజేపీ ఎమ్మెల్యే ఫైర్