Krishnamma kalipindi iddarini June 23th: ఈశ్వర్ కళ్ళు తెరవకుండా అలాగే స్పృహ కోల్పోయి ఉండటంతో సభ్యులంతా ఆందోళన చెందుతారు. అదే సమయంలో అక్కడికి గౌరీ తన తల్లి, చెల్లి తో వస్తుంది. ఇక గౌరీని చూసి ఇంట్లో వాళ్లంతా సంతోషపడతారు. సునంద గౌరీతో నువ్వు కాదనే సరికి ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు అని చెప్పటంతో గౌరీ బాధపడుతుంది. ఇక సునంద గౌరీ తో మాట్లాడుతున్న సమయంలో వెంటనే సౌదామిని సునంద ప్రవర్తన చూస్తే ఇప్పుడే పెళ్లి చేసేలాగా ఉంది అని పుల్లలు వేస్తుంది.


అప్పుడు కాదని ఇప్పుడు ఎలా ఒప్పుకుంటారు అని తన మాటలతో మరోసారి అందర్నీ బాధ పెడుతుంది. అప్పుడే దుర్గా భవాని.. మేము కాదనలేదని మేము మీ స్థాయికి సరిపోతమా లేదా అని ఆలోచించుకొని ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాము అన్నటంతో సౌదామిని షాక్ అవుతుంది. గౌరీ కూడా ఈ పెళ్లికి ఒప్పుకుంది అనటంతో అందరూ సంతోషపడతారు. ఇక ఈశ్వర్ కూడా సంతోషపడతాడు.


అప్పుడే దుర్గ భవాని సునందని పక్కకు తీసుకొని వెళ్లి మాట్లాడుతుంది. దాంతో సరదామని భవాని ఒప్పుకోవడానికి ఏదో గట్టి కారణముందని అనుకుంటుంది. భవాని సునందతో మళ్లీ తన చిన్న కూతురు పెళ్లి గురించి టాపిక్ తీస్తుంది. ఇప్పుడు గౌరీ రాకపోయేసరికి ఈశ్వర్ పరిస్థితి ఎలా ఉంటుందో అని సునందను మరింత భయపెట్టిస్తుంది. వీరిద్దరి పెళ్లి జరగాలంటే నా చిన్న కూతురుతోని చిన్న కొడుకు పెళ్లి జరగాలి అని కండిషన్ పెడుతుంది.


దాంతో సునంద వాళ్ల మనసులో ఏముందో తెలుసుకోకుండా ఎలా చేయాలి అని ఆందోళన చెందుతుంది. కానీ భవాని మాత్రం అదే విషయాన్ని గట్టిగా చెబుతుంది. మరోవైపు ఆదిత్య, అమృత ఎలాగైనా ఇప్పుడు ఇంట్లో తమ ప్రేమ విషయాన్ని చెప్పాలని అనుకుంటారు. అమ్మ ఎలాగైనా తమ ప్రేమని ఒప్పుకుంటుందని ఆదిత్య కూడా అంటాడు.


ఇక ఈశ్వర్ కూడా గౌరీ తో మాట్లాడుతూ ఉంటాడు. మనసులో ఉన్న మాటలు అన్నీ బయటపెడుతూ ఉంటాడు. మీతో ఫ్రెండ్షిప్ చేయడం కోసం మాత్రమే ఫ్యామిలీ గురించి బయట పెట్టలేదు అని.. అబద్దమాడి మీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నాను అని అంటాడు. మీరు అబద్ధం ఆడకున్న కూడా మీతో ఫ్రెండ్షిప్ చేసేదాన్ని.. ఎందుకంటే మీరు మంచి మనసున్న వాళ్ళు అని అంటుంది.


ఇక మీ నోటితో ప్రేమిస్తున్నారని చెబితే నేను చాలా సంతోషపడతానని అనటంతో గౌరీ చెప్పబోతున్న సమయంలో అప్పుడే ఈశ్వర్ చెల్లె, తమ్ముడు వచ్చి ఇల్లంత చూపిస్తానని గౌరీని తీసుకొని వెళ్తారు. దాంతో ఈశ్వర్ కాస్త బాధపడినట్లు కనిపిస్తాడు. ఇక సునంద భవాని మాట్లాడిన మాటలు తలుచుకొని ఏం చేయాలో అర్థం కాకుండా ఆలోచిస్తుంది. ఈశ్వర్ కళ్ళు పోయినందుకు ఆదిత్య మీద కోపం ఉంది కానీ వాడి లైఫ్ మీద నాకు ఎటువంటి కోపం లేదు.. వాడి మనసులో ఏముందో తెలుసుకోకుండా పెళ్లికి బలవంతం చేయలేను అని అనుకుంటుంది.


కానీ ఈశ్వర్ గురించి ఆలోచిస్తే మాత్రం ఆదిత్యను అఖిలతో ఒప్పించటానికి తప్పులేదు అని అనుకుంటుంది. అప్పుడే ఆదిత్య కూడా తన తల్లి ఒంటరిగా ఉందని గమనించి అఖిల విషయం చెప్పడానికి వస్తాడు.


Also Read: Prema Entha Madhuram June 23th: ఆస్తుల కోసం బరితెగించేస్తున్న మాన్సీ-మరో సీక్రెట్ ప్లేస్ కు చేరుకున్న అను?