ఖతర్నాక్ కామెడీ షో 'జబర్దస్త్' (Jabardasth Show) కు వెండితెర రంగమ్మత్త, బుల్లితెర అందాల భామ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) వీడ్కోలు పలికారు. జూలై నెలలో ఆఖరి వారంలో టెలికాస్ట్ అయిన 'జబర్దస్త్' ఎపిసోడ్, సూపర్ హిట్ కామెడీ షో యాంకర్‌గా అనసూయకు లాస్ట్ ఎపిసోడ్. ఆ విషయం క్లారిటీగా చెప్పేశారు. మరి, ఆమె ప్లేస్‌లో వస్తున్న కొత్త యాంకర్ ఎవరు? అనేది ఆ ఎపిసోడ్‌లో చెప్పలేదు. సస్పెన్స్‌లో పెట్టారు.


Jabardasth Latest Promo With New Anchor : ఆగస్టు తొలి వారంలో టెలికాస్ట్ కానున్న ఎపిసోడ్ ప్రోమో లేటెస్టుగా విడుదల చేశారు. అందులో స్టార్టింగ్ నుంచి ఎక్కడా యాంకర్‌ను చూపించలేదు. ప్రోమో చివర్లో... పల్లకిలో ‘జబర్దస్త్’ కొత్త యాంకర్‌ను తీసుకొచ్చారు. 'ఎవరో కనిపెట్టండి చూద్దాం!' అన్నట్టు బుల్లితెర వీక్షకులకు పజిల్ వదిలారు.


Rashmi Gautam Takes Charge As Jabardasth New Anchor : అనసూయ స్థానంలో మంజూష, స్రవంతి చొక్కారపు తదితరులను యాంకర్‌గా తీసుకు వస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అందులో నిజం లేదు. ప్రస్తుతం 'ఎక్స్ట్రా జబర్దస్త్'కు యాంకరింగ్ చేస్తున్న రష్మీ గౌతమ్ (Rashmi Gautam)  కు 'జబర్దస్త్' యాంకరింగ్ బాధ్యతలు అప్పగించారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మల్లెమాల సంస్థ కొత్త యాంకర్‌ను తీసుకోలేదని, ఆల్రెడీ 'ఎక్స్ట్రా జబర్దస్త్'తో వీక్షకుల మనసు దోచిన రష్మీని 'జబర్దస్త్'కు తీసుకొచ్చి ఎక్స్ట్రా స్పైస్ యాడ్ చేశారని తెలుస్తోంది.


Also Read : హిందూ మతం నాకు తల్లితో సమానం - క్షమాపణలు కోరిన 'కమిట్‌మెంట్' దర్శకుడు



'జబర్దస్త్'లో 'కార్తికేయ 2' టీమ్ సందడి
ఆగస్టు తొలి వారంలో టెలికాస్ట్ కానున్న రష్మీ గౌతమ్ మొట్టమొదటి 'జబర్దస్త్' ఎపిసోడ్‌లో నిఖిల్ సిద్ధార్థ్ 'కార్తికేయ 2' టీమ్ సందడి చేయనుంది. హీరోతో పాటు ప్రముఖ హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి, చిత్ర దర్శకుడు చందూ మొండేటి కూడా సందడి చేయనున్నారు. స్టేజి మీద నిఖిల్ డైలాగులు చెప్పారు. సంగీత, ఇంద్రజ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.     


Also Read : 'గంగోత్రి'లో బాలనటి - ఇప్పుడు 'మాసూద'లో కథానాయికి