Guppedantha Manasu February 16th Episode:  (గుప్పెడంతమనసు ఫిబ్రవరి 16 ఎపిసోడ్)


డీబీఎస్‌టీ కాలేజీ త‌న సొంతం అవుతుంద‌ని శైలేంద్ర ఆనందాన్ని ఆవిరిచేసేస్తాడు కొత్తగా వచ్చిన హీరో మను. ఆ తర్వాత ఫ్రస్ట్రేషన్ లో బయటకు వచ్చి చర్చ పెట్టుకుంటారు రాజీవ్- శేలేంద్ర. వాడు వ‌స్తాడ‌ని ముందు నుంచి చెబుతూనే ఉన్నాన‌ు నువ్వే పట్టించుకోలేదని మండిపడతాడు రాజీవ్. 
వ‌సుధార‌కు -వాడికి సంబంధం ఏంటో, వాడు ఎందుకు అంత డబ్బులిచ్చాడో అర్థం కావడం లేదంటాడు. అప్పట్లో మురుగన్ గాడు లాస్ట్ మినిట్లో వచ్చి నా ప్లాన్ ఫెయిల్ చేశాడు, ఇప్పుడు వీడు అని మండిపడతాడు.  ఏం ఆశించ‌కుండా ఎందుకు అంత డ‌బ్బు ఇచ్చాడా అని ఆలోచిస్తుంటాడు. ప్ర‌తిసారి చివ‌రి నిమిషంలో ఎవ‌డో ఒక‌డు వ‌చ్చి త‌న ప్లాన్ చెడ‌గొడుతున్నాడ‌ని కోప్ప‌డ‌తాడు. రిషి లేక‌పోయినా కూడా కాలేజీని సొంతం చేసుకోలేక‌పోతున్నాన‌ని  అరుస్తుంటాడు శైలేంద్ర. ఎండీ సీట్ కోసం ఎన్నో కుట్ర‌లు చేశాను. ఎంతో మంది ప్రాణాలు తీశాను. కానీ ఆ ఆ సీట్ మాత్రం త‌న‌కు ద‌క్క‌డం లేద‌నుకుంటాడు. ఇక బయలుదేరుదాం మరో ప్లాన్ ఆలోచిద్దాం అని రాజీవ్ అంటాడు. ఇంటికి బయలుదేరుదాం అనుకున్న శైలేంద్ర కి...ధరణి మాటలు గుర్తొస్తాయి. తను అన్నట్టుగానే జరిగిందని ముందే ఎలా తెలిసిందని అనుకుంటాడు..


Also Read: 1000 ఎపిసోడ్ లో అదిరిపోయే ట్విస్ట్ - కాలేజ్ లోకి 'మను' ఎంట్రీ మామూలుగా లేదు!


పెద్దమ్మ - మను
ఈ రోజు కాలేజీకి వెళ్లావా? అనుప‌మ‌ను క‌లిశావా? అని మ‌నును అడుగుతుంది పెద్ద‌మ్మ‌. కాలేజీకి వెళ్లాన‌ు కానీ అక్కడ సమస్య సాల్వ్ చేసి వచ్చానంతే అనుపమతో మాట్లాడలేదంటాడు మను.  కాలేజీ కోసం యాభై కోట్లు చెక్ ఇచ్చేంత ఎమోష‌న్‌, ఎఫెక్ష‌న్ ఉండ‌టానికి కార‌ణం ఏంటని పెద్దమ్మ అడిగిన ప్రశ్నకు..డీబీఎస్‌టీ కాలేజీ ప‌ద్ద‌తులు, విధివిధానాలు అంటే త‌న‌కు ఇష్ట‌మ‌ని, డీబీఎస్‌టీ కాలేజీ ఎలాంటి ప్రాబ్లెమ్‌లో ఇరుక్కోకూడ‌ద‌నే సాయ‌ప‌డ్డాన‌ని, గతంల రిషితో చాలా సార్లు కాన్ఫరెన్స్ లో పాల్గొన్నానని...ఆ కాలేజీ కష్టాల్లో ఉంటే చూస్తూ ఊరుకోలేను అంతకు మించి ఎలాంటి స్వార్థం లేదంటాడు. 


రిషి ఆలోచనలో వసుధార
అందరూ మీ గురించి ఏవేవో మాట్లాడుతున్నారు...మీగురించి ఎదురుచూస్తున్నా సర్ తొందరగా రండి...లేజీ చేజారిపోతున్న స‌మ‌యంలో ఓ వ్య‌క్తి వ‌చ్చి తిరిగి కాలేజీని త‌న చేతుల్లో పెట్టాడ‌ని క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. మీరే త‌న రూపంలో వ‌చ్చి ఈ స‌మ‌స్య‌ను గ‌ట్టెక్కించిన‌ట్లు అనిపించింది.. మీరే నాకు తోడుగా ఉంటార‌ని, ఏదో ఒక శ‌క్తి రూపంలో మీరు వ‌చ్చి స‌మ‌స్య‌ను తీరుస్తార‌ని ముంద‌డుగు వేశాన‌ని నా న‌మ్మ‌కం నిజ‌మైంద‌ని వ‌సుధార అనుకుంటుంది. 


Also Read: వచ్చాడయ్యో సామి - వసుధార నమ్మకమే నిజమైంది కాలేజ్ సేఫ్!


ఆలోచనలో అనుపమ
మ‌ను కాలేజీకి వ‌చ్చి స‌మ‌స్య‌ను సాల్వ్ చేయ‌డం అనుప‌మ‌కు ప‌దే ప‌దే గుర్తొస్తుంది. ఈ స‌మ‌స్య గురించి పెద్ద‌మ్మ‌కు చెప్పి త‌ప్పు చేశాన‌ని అనుకుంటుంది. ఇంతలో అక్కడకు వచ్చిన మహేంద్ర...ఏమైందని అడిగితే ఏమీలేదనేస్తుంది. వ‌సుధార స‌మ‌స్య సాల్వ్ కావ‌డం ఆనందంగా ఉంద‌ని అంటుంది.
మ‌ను నీకు తెలుసా అని అనుప‌మ‌ను అడుగుతాడు మ‌హేంద్ర‌. మ‌ను కాలేజీకి వ‌చ్చిన‌ప్పుడు నువ్వు టెన్ష‌న్‌గా క‌నిపించడం గమనించాను...మీ ఇద్దరి మధ్యా పరిచయం ఉందా అని ప్రశ్నిస్తాడు...కానీ అనుపమ సమాధానం చెప్పదు. మళ్లీ మళ్లీ అదే ప్రశ్న అడగడంతో సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది..


Also Read: ఈ రాశులవారికి ఆస్తుల నుంచి అనుకోని ఆదాయం వస్తుంది, ఫిబ్రవరి 16 రాశిఫలాలు


శైలేంద్ర‌ - ధరణి
ఎండీ సీట్ త‌న‌కే ద‌క్కుతుంద‌ని ధ‌ర‌ణితో చేసిన ఛాలెంజ్‌లో ఓడిపోవ‌డంతో కంగారు ప‌డ‌తాడు శైలేంద్ర.... ధ‌ర‌ణి త‌న‌కు ఎలాంటి ప‌నిష్‌మెంట్ విధిస్తుందో అనే ఆలోచనతో ఇంట్లో అడుగుపెడతాడు. హాల్‌లో సోఫాలో అన్నీ తీసేసి ఉంటాయి. ఓ చిన్న చైర్ మాత్ర‌మే క‌నిపిస్తుంది. సోఫాల‌న్నీ తానే తీసేశాన‌ని, మీకు కుర్చీ పిచ్చి త‌గ్గే వ‌ర‌కు మీరు ఇందులోనే కూర్చోవాల‌ని చిన్న కుర్చీ చూపించి శైలేంద్ర‌తో అంటుంది ధ‌ర‌ణి. త‌న‌తో శైలేంద్ర చేసిన ఛాలెంజ్ ను గుర్తుచేస్తుంది. ఆ ఛాలెంజ్‌లో ఓడిపోతే నేను ఏం చెప్పినా చేస్తాన‌ని అన్నారు క‌దా అని అడుగుతుంది. ఛాలెంజ్‌లో ఓడిపోతే నీకు బానిస‌లా ఉంటాన‌ని, ఇంటీ ప‌నుల‌న్నీ చేస్తాన‌ని తాను పొగ‌రుగా అన్న మాట‌లు గుర్తొచ్చి శైలేంద్ర కంగారు ప‌డ‌తాడు. మీరు చెప్పిన ప‌నుల‌న్నీ చేయాలి లేదంటే ఈ కుర్చీలో లైనా కూర్చోవాలి అని ధ‌ర‌ణి ప‌ట్టుప‌డుతుంది. బ‌ల‌వంతంగా ఆ కుర్చీలో శైలేంద్ర‌ను కూర్చ‌బెడుతుంది. ఈ కుర్చీ మీకు బాగా సూటైంద‌ని, ఇందులో రాజులా ఉన్నార‌ని అంటుంది. ఇంతలో ధరణి పిలవడంతో కలలోంచి బయటకొస్తాడు శైలేంద్ర. ధ‌ర‌ణి కాఫీ ఇస్తాన‌ని అన్న వ‌ద్ద‌ని చెప్పి కంగారుగా అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు.   


Also Read: ఫిబ్రవరి 16 రథసప్తమి - ఈ రోజు పాలు పొంగించి ఇవి చదువుకోండి!