Guppedantha Manasu Serial Today Episode:  (గుప్పెడంతమనసు ఆగష్టు 20 ఎపిసోడ్)


అనుపమ ఇంటికి.... మహేంద్ర కూడా వస్తానని చెప్పినప్పటికీ వద్దని వారించి రిషి, వసుధార కలసి వెళతారు. కానీ వసుధార ప్రవర్తనలో ఏదో తేడా వచ్చిందని గమనించిన మహేంద్ర..అదేంటో తెలుసుకోవాలని అనుకుంటాడు...


శైలేంద్ర-మను
మనుకి కాల్ చేసిన శైలేంద్ర..బ్రదర్, తమ్ముడు అంటూ కావాలని ఇరిటేట్ చేస్తాడు. ఓసారి కలవాలని అడిగితే మను ఫైర్ అవుతాడు. నువ్వు నేరుగా కలవకుంటే మీ అమ్మ అనుపమకు కాల్ చేసి నువ్వు నన్ను కిడ్నాప్ చేసిన విషయం చెప్పేస్తానని బెదిరిస్తాడు. మను చేసేది లేక కోపంగా కాల్ కట్ చేసి ఇంట్లోంచి బయలుదేరుతాడు. ఇదంతా చూసిన అనుపమ కంగారుపడుతుంది. నువ్వు కాల్ కట్ చేశావంటే వస్తున్నావని నాకు తెలుసు...రా..ఇకపై కథ ఎలా నడిపించాలో నాకు తెలుసు అని క్రూరంగా నవ్వుకుంటాడు శైలేంద్ర...


Also Read: ఆగష్టు 20 రాశిఫలాలు - ఈ రాశులవారు స్థిరాస్తులు కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు!


అనుపమ -వసు - రిషి
మను వెళ్లిన వెంటనే రిషిధార వస్తారు...మను ఎక్కడని అడిగితే తన ప్రవర్తనలో ఏదో మార్పు వచ్చిందని అనుపమ చెబుతుంది. రిషి నవ్వు కాలేజీ బాధ్యతలు చేపట్టినందుకు సంతోషంగా ఉందంటుంది. కాఫీ తీసుకొచ్చి ఇస్తానని వెళ్లిన అనుపమను అనుసరిస్తుంది వసుధార. ఇన్నాళ్లు దాచినది చాలు..రిషి సర్ ను ఫేస్ చేయలేకపోతున్నా...ఆయనకు నిజం చెప్పేద్దామని నిర్ణయించుకున్నాను. మను తండ్రి ఎవరో చెప్పేస్తానని అంటుంది. వద్దు తెలిస్తే పరిస్థితులు ఎలా మారిపోతాయో అని అనుపమ భయపడుతుంది. ఏం జరగదు..రిషి సర్ ప్రాబ్లెమ్ సాల్వ్ చేస్తారని హామీ ఇస్తుంది వసుధార. ఇంతలో ఏ విషయం వసుధారా అంటూ లోపలకు ఎంట్రీ ఇస్తాడు రిషి


మను టార్గెట్
శైలేంద్ర కు గన్ గురిపెట్టిన మను నన్ను బెదిరిస్తావా అని ఫైర్ అవుతాడు. ఏంటి నాదగ్గర గన్ లేదనుకుంటున్నావా అని రివర్సవుతాడు శైలేంద్ర. అయినా తండ్రి ఎవరో తెలిస్తే ఏదో చేసేస్తానన్నావ్..ఇప్పుడు మహేంద్ర తండ్రి అని తెలిసి ఆగిపోయావా? ఆ కోపం ద్వేషం ఏమైపోయాయ్? మా బాబాయ్ మహేంద్రని ఏం చేయబోతున్నావ్? ఆయన పేరు వారసత్వం వస్తుందని ఆశపడుతున్నావా? అందుకే వెనక్కు తగ్గావా? నీ నిర్ణయం మార్చుకున్నావా అని రెచ్చగొడతాడు. ఇక మను కూడా ఆవేశంగా ఆగష్టు ఆఖరుకి నా ప్రతాపం ఏంటో చూస్తావ్ అంటుంది.  
  
నిజం చెప్పేసిన వసుధార
ఏం జరిగింది వసుధార అని రిషి అంటే...మను తండ్రి ఎవరంటే అని వసుధార చెప్పబోతోంది. అయితే వసుని ఆపిన రిషి.. మేడం మీరు ఆ విషయం దాచారంటే ఏదో కారణం ఉంటుందని అనుకుంటున్నాను.. తండ్రి ఎవరన్నది కాదుకానీ ఎందుకు చెప్పకూడదని అనుకుంటున్నారో చెప్పండి అంటాడు. అంతలోనే..అసలు ఆయన గురించి ఎందుకు చెప్పడం లేదు..తను మంచివాడు కాదా, బాధ్యతలు తెవియవా, తాగుబోతా, తిరుగుబోతా , నీచుడా అంటూ నెగిటివ్ గా మాట్లాడుతాడు రిషి. ఆ మాటలు విని భరించలేకపోయిన వసుధార..  సర్ ఇక చాలు ఆపండి మను తండ్రి మావయ్యే అని చెప్పేస్తుంది... ఆ మాట విని రిషి షాక్ అవుతాడు. ఇదంతా బయట నిల్చుని వింటున్న మహేంద్ర కూడా షాక్ అవుతాడు. 
 
ఇది నిజం అని ఒప్పుకున్న అనుపమ..నేను పాపిష్టిదాన్ని ఇదంతా కాలనిర్ణయం..ఇందులో నా తప్పులేదంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది... ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది...


గుప్పెడంతమనసు ఆగష్టు 21 ఎపిసోడ్ లో అసలు విషయం బయటపడనుంది... 


Also Read: బ్రహ్మముడి ఆగష్టు 20 ఎపిసోడ్ - దుగ్గిరాలవారింట్లో టిఫిన్ రేట్లు ఇవే - రాజ్ తో ఆడేసుకున్న కావ్య!