బుల్లితెరపై 'జబర్దస్త్' షోకి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ షో చూస్తుంటారు. ఎన్ని వివాదాలు ఎదురైనా.. ఇప్పటికీ నెంబర్ వన్ కామెడీ షోగా దూసుకుపోతుంది 'జబర్దస్త్'. ఈ షోని మొదలుపెట్టి దాదాపు తొమ్మిది సంవత్సరాలు అవుతోంది. అత్యధిక టీఆర్ఫీతో దూసుకుపోతుంది. దీంతో ఈ షోని కాపీ చేస్తూ చాలా కామెడీ షోలు వచ్చాయి. కానీ 'జబర్దస్త్' ముందు ఏదీ నిలవలేకపోయింది. కానీ ఈ మధ్యకాలంలో 'జబర్దస్త్' రేటింగ్స్ తగ్గుతున్నాయి. రొటీన్ స్కిట్ లతో ప్రేక్షకులను విసిగిస్తున్నారు. ఒకట్రెండు టీమ్స్ మినహా.. మిగిలిన వాళ్ల స్కిట్ లను చూడడానికి ప్రేక్షకులు ఇష్టపడడం లేదు. 


యూట్యూబ్ లో ఎపిసోడ్స్ ను బిట్స్ బిట్స్ గా టెలికాస్ట్ చేస్తుండడంతో.. తమకు నచ్చిన స్కిట్ లను చూసుకుంటున్నారు ఆడియన్స్. దీంతో సరైన రేటింగ్స్ రావడం లేదు. ఈ రేటింగ్ ను మరింత ఎఫెక్ట్ చేస్తూ.. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను వంటి కమెడియన్స్ షో నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు యాంకర్ అనసూయ వంతు వచ్చింది. ఈ షో నుంచి ఆమె తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ షోతో అనసూయ విపరీతమైన పాపులారిటీ సంపాదించింది. అలాంటిది ఆమె ఈ షోకి గుడ్ బై చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. 


ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది అనసూయ. అయితే 'జబర్దస్త్' షో పేరు ప్రస్తావించకుండా.. తను తప్పుకుంటున్నట్లు చెప్పింది. తన కెరీర్ లో తీసుకున్న పెద్ద డెసిషన్ ను ఈరోజు నుంచి అమలు చేస్తున్నట్లు చెప్పింది. చాలా జ్ఞాపకాలను నాతో పాటు తీసుకెళ్తున్నాను.. అందులో మంచి, చెడు అన్నీ ఉన్నాయని తెలిపింది. మీరంతా ఎప్పటిలానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా అంటూ రాసుకొచ్చింది. 


ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. అనసూయ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలేంటా..? అని ఆరా తీస్తున్నట్లు అభిమానులు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాలు ఒప్పుకుంటుంది. లీడ్ రోల్స్ లో కొన్ని సినిమాలు చేస్తూనే.. మరోపక్క పెద్ద సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తోంది. 


Also Read : విడాకుల వార్తలపై స్పందించిన సింగర్స్ శ్రావణ భార్గవి, హేమచంద్ర


Also Read : మగబిడ్డకు జన్మనిచ్చిన 'దిల్' రాజు భార్య తేజస్విని వ్యాఘా రెడ్డి